ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Duvvada Srinivas: ప్రియురాలితో కలిసి తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్ హల్‌చల్..

ABN, Publish Date - Oct 07 , 2024 | 12:13 PM

తన భార్యతో వివాదం కారణంగా దువ్వాడ శ్రీనివాస్ చాలా సైలెంట్ అయిపోయారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు దూరంగా ఉంటూ మరో మహిళతో ఉంటున్నారని ఆయన భార్య ఆరోపించారు. ఈ అంశంపై కొంత వివాదం నడిచింది. ఇదే సమయంలో ఆస్తుల పంపకానికి సంబంధించిన వివాదం దువ్వాడ శ్రీనివాస్‌ను వెంటాడింది. సుమారు నెల రోజుల తర్వాత మళ్లీ తన ప్రియురాలు మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ తిరుమల కొండపై కనిపించారు.

Duvvada Srinivas

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం వైసీపీ మాజీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చాలారోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తన ప్రియురాలు మాధురితో కలిసి మీడియాకు ఫోజులిచ్చారు. కొద్దిరోజులుగా తన భార్యతో వివాదం కారణంగా దువ్వాడ శ్రీనివాస్ చాలా సైలెంట్ అయిపోయారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు దూరంగా ఉంటూ మరో మహిళతో ఉంటున్నారని ఆయన భార్య ఆరోపించారు. ఈ అంశంపై కొంత వివాదం నడిచింది. ఇదే సమయంలో ఆస్తుల పంపకానికి సంబంధించిన వివాదం దువ్వాడ శ్రీనివాస్‌ను వెంటాడింది. సుమారు నెల రోజుల తర్వాత మళ్లీ తన ప్రియురాలు మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ తిరుమల కొండపై కనిపించారు. ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారిద్దరూ మీడియాకు ఫోజులిచ్చారు. తన భార్యతో వివాదం కారణంగా వైసీపీ టెక్కలి ఇన్‌ఛార్జ్ పదవి నుంచి దువ్వాడను తప్పించింది. ఆయన తీరుతో పార్టీకి నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో దువ్వాడను వైసీపీ పక్కనపెట్టింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టెక్కలి నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన దువ్వాడ శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన అచ్చెన్నాయుడు చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు.


మాధురితో కలిసి..

ఎన్నికల ముందు నుంచి దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి మధ్య విబేధాలు తలెత్తాయి. అసలు విషయం బయటకు చెప్పకపోయినప్పటికీ ఎమ్మెల్యే టికెట్ విషయంలో పెద్ద వివాదమే నడిచింది. వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనలో దువ్వాడ శ్రీనివాస్‌కు టెక్కలి టికెట్ ప్రకటించారు. కానీ దువ్వాడ వాణి మాత్రం శ్రీనివాస్ అభ్యర్థిత్వంపై అసంతృప్తితో ఉన్నారు. అప్పటికే దువ్వాడ శ్రీనివాస్ వేరే మహిళతో ఉంటున్న విషయం వాణికి తెలిసినప్పటికీ.. విషయాన్ని బహిర్గతం చేయలేదు. ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో వైసీపీ హైకమాండ్ జోక్యంతోనే దువ్వాడ శ్రీవాణి విషయాన్ని బయటపెట్టలేదనే ఆరోపణలు వినిపించాయి. దువ్వాడ శ్రీనివాస్ కొన్నేళ్లుగా మాధురి అనే మరో మహిళతో ఉంటూ కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. విషయం కుటుంబ సభ్యులకు తెలిసినప్పటికీ వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం బయటకు పొక్కనీయలేదు. అధికారం పోయిన తర్వాత దువ్వాడ వాణి తన భర్త మరో మహిళతో ఉంటున్న విషయాన్ని బహిర్గతం చేశారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది.


మాధురితోనే ఉంటానని..

మాధురితో ఉన్న సంబంధం బయటపడటంతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. తాను వాణితో ఇకనుంచి కలిసి ఉండలేనని, తాను మాధురితోనే ఉంటానని స్పష్టంచేశారు. దీనిపై వాణి కొన్ని డిమాండ్లను శ్రీనివాస్ ముందుంచగా.. కొన్నింటికి ఆయన అంగీకరించలేదు. చివరికి పెద్ద మనుషుల పంచాయితీలో ఆస్తుల పంపకంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. వివాదం తర్వాత శ్రీనివాస్, మాధురి కొద్దిరోజులు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆస్తుల పంచాయితీ తేలడంతో మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ కలిసి ఉంటున్నట్లు సమాచారం. తాజాగా సోమవారం తిరుమలలో ఇద్దరు కలిసి కనిపించడంతో దువ్వాడ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 07 , 2024 | 12:13 PM