ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

New Delhi: జగన్ పాలనలో అప్పులు ఘనం.. అభివృద్ధి శూన్యం

ABN, Publish Date - Jul 21 , 2024 | 02:28 PM

పార్లమెంట్ బడ్జెట్ ‌సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం న్యూఢిల్లీలో అఖిలపక్షం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్‌లో గత అయిదేళ్లలో వైసీపీ సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తావించారు.

న్యూఢిల్లీ, జులై 21: పార్లమెంట్ బడ్జెట్ ‌సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం న్యూఢిల్లీలో అఖిలపక్షం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్‌లో గత అయిదేళ్లలో వైసీపీ సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తావించారు. వైఎస్ జగన్ పాలనలో చేసిన అప్పులు ఘనంగా.. అభివృద్ధి శూన్యంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.


మొత్తంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా నష్ట పరిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో జరిగిన ఈ ఆర్థిక విధ్వంసంపై టీడీపీ ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయనుందని ఈ భేటీలో ఆయన వెల్లడించారు. ఇక ఇదే భేటీలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు. నీట్ అవకతవకలు, ఈడీ, సీబీఐలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేయడంపాటు లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి అంశాన్ని సైతం ఆ పార్టీ నేతలు లేవనెత్తారు.


ఇక ఎన్డీయే మిత్రపక్షం జేడీ(యూ) బిహార్‌కు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసింది. అలాగే వైయస్ఆర్ సీపీ అయితే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్జప్తి చేసింది. అలాగే కన్వర్ యాత్ర నేపథ్యంలో ఆ యాత్ర సాగే ప్రాంతంలో తినుబండారశాలలు, హోటళ్ల వద్ద యాజమాన్యం పేర్లు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలంటూ ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాన్ని ఈ అఖిల పక్ష భేటీలో సమాజవాదీ పార్టీ (ఎస్పీ) ప్రస్తావించింది.


ఈ బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు ఆర్థిక సర్వేను కేంద్రం విడుదల చేయనుంది. ఆ మరునాడు అంటే మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టనున్నారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఆదివారం ఉదయం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ అఖిల పక్ష సమావేశం ప్రారంభమైంది.


టీడీపీ నుంచి ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి గౌరవ్ గొగొయ్, కాంగ్రెస్ పార్టీ నుంచి జైరాం రమేశ్, కె.ఎస్. సురేశ్‌.. ఎంఐఎం నుంచి ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆర్జేడీ నుంచి అభయ్ కుశ్వా, ఆప్ నుంచి సంజయ్ సింగ్, ఎస్పీ నుంచి రామ్ గోపాల్ యాదవ్, ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్ తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జులై 22న ప్రారంభమై.. ఆగస్ట్ 12వ తేదీతో ముగియనున్నాయి. ఆ సమావేశంలో ఆరు బిల్లులను ఆమోదించేందుకు మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 21 , 2024 | 02:33 PM

Advertising
Advertising
<