AP NEWS: వైసీపీ నేతలపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం.. కారణమిదే..?
ABN, Publish Date - Feb 13 , 2024 | 09:47 PM
వైసీపీ నేతల తీరుపై సీఎం జగన్ (CM Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు ‘‘ఆడుదాం - ఆంధ్రా’’ ముగింపు కార్యక్రమానికి జనం తక్కువగా రావడంపై మండిపడ్డారు.
విశాఖపట్నం: వైసీపీ నేతల తీరుపై సీఎం జగన్ (CM Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు ‘‘ఆడుదాం - ఆంధ్రా’’ ముగింపు కార్యక్రమానికి జనం తక్కువగా రావడంపై మండిపడ్డారు. స్టేడియంలో గ్యాలరీలు చాలా వరకు ఖాళీగా కనిపించడంతో జగన్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే లైట్గా ఎందుకు తీసుకున్నారని క్లాస్ పీకారు.
ప్రజలకు ట్రాఫిక్ తిప్పలు
సీఎం విశాఖకు ఎప్పుడూ వచ్చినా ప్రజలకు కష్టాలే అని అక్కడున్న ప్రజలు మాట్లాడుకున్నారు.స్టేడియం నుంచి రోడ్డు మార్గంలో ఎయిర్ పోర్ట్కి వెళ్లినప్పుడు ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. సీఎం వెళ్లే వరకు వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో నగరంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Updated Date - Feb 13 , 2024 | 09:48 PM