ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: ప్రజల్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసిన చరిత్ర మీ పార్టీదే: ఎమ్మెల్యే గంటా

ABN, Publish Date - Jul 01 , 2024 | 02:52 PM

ఏపీలో ప్రస్తుత పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(MLA Ganta Srinivasa Rao) మండిపడ్డారు. టీడీపీ నాయకులు ప్రైవేటు ఆస్తులైన వైసీపీ కార్యాలయాల్లోకి వెళ్లి సందర్శించడం సరికాదన్న బొత్స మాటలపై ఆయన ధ్వజమెత్తారు.

MLA Ganta Srinivasa Rao

విశాఖపట్నం: ఏపీలో ప్రస్తుత పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(MLA Ganta Srinivasa Rao) మండిపడ్డారు. టీడీపీ నాయకులు ప్రైవేటు ఆస్తులైన వైసీపీ కార్యాలయాల్లోకి వెళ్లి సందర్శించడం సరికాదన్న బొత్స మాటలపై ఆయన ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులను ఎమ్మెల్యే గంటా గుర్తు చేశారు. భయపెట్టడం, బెదిరించడమనేది మీ పార్టీ నాయకుల పేటెంట్ సత్తిబాబు అంటూ ఎక్స్ వేదికగా బొత్సపై గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు.


"టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ. ప్రతిపక్ష నాయకులను, అధికారులనే కాదు చివరికి సామాన్య ప్రజలను కూడా బెదిరించి భయపెట్టిన పార్టీ మీది. హిమాలయాలకు వెళ్లిపోవాలనుకునేంత మైండ్ బ్లాంకైన ఘోరమైన ఓటమి తర్వాత కూడా మీలో జ్ఞానోదయం కలిగకపోవడం విచారకరం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఎందుకు ఛీకొట్టారో ముందు తెలుసుకో" అంటూ ఎమ్మెల్యే చురకలు అంటించారు.

Updated Date - Jul 01 , 2024 | 02:52 PM

Advertising
Advertising