ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minimum Wages: పండుగలకు ముందే కార్మికులకు గుడ్ న్యూస్.. కనీస వేతనం పెంపు

ABN, Publish Date - Sep 27 , 2024 | 07:11 AM

పండుగలకు ముందే కేంద్ర ప్రభుత్వం కార్మికులకు శుభవార్త చెప్పింది. ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాన్ని(Minimum Wages) పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఏ మేరకు పెంచారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Minimum Wages hike

పండుగలకు ముందే దేశంలోని కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ క్రమంలో స్కిల్డ్, హాఫ్ స్కిల్డ్, అన్ స్కిల్డ్ వంటి పలు వర్గాల కార్మికులకు ప్రభుత్వం కనీస వేతన రేటును(Minimum Wages) పెంచింది. దీంతో కోట్లాది మంది కార్మికులు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వం కనీస వేతనాల రేటు పెంచుతున్నట్లు ప్రకటించినందున నైపుణ్యం, నైపుణ్యం లేని వర్గాల కార్మికుల ఆదాయాలు పెరుగుతాయి. వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్‌ని సవరించిన తర్వాత దేశంలోని కార్మికుల కనీస వేతనాలు పెంచినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కనీస వేతనాన్ని రోజుకు రూ.1,035కు పెంచింది.


ఎవరి సంపాదన ఎంత

కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం ఈ సవరణ తర్వాత నిర్మాణ, శుభ్రపరచడం, వస్తువులను లోడింగ్, అన్‌లోడ్ చేయడం వంటి నైపుణ్యం లేని కేటగిరీ పనిలో నిమగ్నమైన కార్మికులకు ఏ కేటగిరీలో కనీస వేతనం రోజుకు రూ. 783 (నెలకు రూ. 20,358). అదేవిధంగా సగం నైపుణ్యం కలిగిన కార్మికులకు కనీస వేతనం రేటు రోజుకు రూ. 868 (నెలకు రూ. 22,568). ఇక నైపుణ్యం, క్లర్క్, నిరాయుధ వాచ్‌మెన్ లేదా గార్డులకు ఈ రేటు రోజుకు రూ. 954 (నెలకు రూ. 24,804). ఇది కాకుండా అధునాతన నైపుణ్యం కలిగిన కార్మికులు, ఆయుధాలతో వాచ్‌మెన్ లేదా గార్డ్‌లుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనం రేటు రోజుకు రూ.1,035 (నెలకు రూ. 26,910)కు పెంపుదల చేశారు.


కొత్త రేట్ల అమలు

పండుగల ప్రారంభానికి ముందు అంటే అక్టోబర్ 1, 2024 నుంచి కనీస వేతనాల కొత్త రేట్లు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్మికుల పెరుగుతున్న జీవన వ్యయాన్ని అధిగమించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కనీస వేతనాలు చివరిసారిగా ఏప్రిల్ 2024లో సవరించబడ్డాయి. నైపుణ్యం కలిగిన స్థాయి కాకుండా, కనీస వేతన రేట్లు కూడా భౌగోళిక స్థాన వర్గాలుగా విభజించబడ్డాయి. వీటిని కేటగిరీలు ఏ, బీ, సీ ప్రాంతాల ఆధారంగా విభజించారు. దీంతో కార్మికల జీతాలు ఇకపై పెరగనున్నాయి.


మరింత సమాచారం

అసంఘటిత రంగంలోని కార్మికులను ఆదుకోవడానికి వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్‌ను సవరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కనీస వేతన రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించిందని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రంగాల వారీగా కనీస వేతన రేట్లకు సంబంధించి మరింత వివరణాత్మక సమాచారం భారత ప్రభుత్వ చీఫ్ లేబర్ కమిషనర్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. (clc.gov.in).


ఇవి కూడా చదవండి:

Personal Finance: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో రూ.10 లక్షలు పెడితే.. మీకు వడ్డీనే రూ. 20 లక్షలొస్తుంది తెలుసా..


Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Read More Business News and Latest Telugu News

Updated Date - Sep 27 , 2024 | 07:14 AM