ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

West Bengal: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో గవర్నర్ కీలక భేటీ.. బెంగాల్‌పై నివేదిక

ABN, Publish Date - Aug 30 , 2024 | 01:16 PM

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద్ బోస్ శుక్రవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోల్‌కతాలో చోటు చేసుకున్న తాజా పరిస్థితులపై ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది.

కోల్‌కతా, ఆగస్ట్ 30: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద్ బోస్ శుక్రవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోల్‌కతాలో చోటు చేసుకున్న తాజా పరిస్థితులపై ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అలాగే ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన నాటి నుంచి నిన్న మొన్నటి బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బంద్ వరకు జరిగిన వరుస పరిణామాలపై మంత్రి అమిత్ షాకు గవర్నర్ బోస్ నివేదిక అందజేసినట్లు సమాచారం. గురువారం సాయంత్రం గవర్నర్ ఆనంద్ బోస్ న్యూఢిల్లీ చేరుకున్నారు.

Jharkhand: మంత్రిగా రామదాస్ ప్రమాణం


గత వారం ఢిల్లీ పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్‌తో బెంగాల్ గవర్నర్ బోస్ వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బెంగాల్‌లో ట్రైయినీ వైద్యురాలి హత్యాచార ఘటనతోపాటు తదానంతరం చోటు చేసుకున్న పరిణామాలను వారికి గవర్నర్ వివరించిన సంగతి తెలిసిందే.

Also Read: Ram Chander: కలలో కనిపించి మందలించిన సీఎం


ఆగస్ట్ 8వ తేదీ రాత్రి ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో విధులకు ట్రైయినీ వైద్యురాలి హాజరయింది. ఆ రోజు తెల్లవారుజామున అంటే ఆగస్ట్ 9 తేదీ విశాంత్రి తీసుకునేందుకు సెమినార్ హాల్‌లోకి వెళ్లింది. ఆ రోజు ఉదయం సెమినార్ హాల్‌లో అర్థనగ్నంగా ఆమె మృతదేహం పడి ఉండడాన్ని ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు.

Also Read: Sri Lanka: దేశాధ్యక్షుడి ఎన్నికల వేళ.. కొలంబోకు అజిత్ దోవల్


ఈ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది ఆందోళనకు దిగారు. ఈ ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై నిరసనలు అయితే వెల్లువెత్తాయి.

Also Read: Maharashtra: శివాజీ విగ్రహం కూలిన ఘటనలో పాటిల్ అరెస్ట్

Also Read: Manipur: ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌లో రైఫిళ్లు చోరీ.. ఐదుగురు అరెస్ట్


మరోవైపు ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ కోల్‌కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంకోవైపు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఛలో సెక్రటేరియట్‌కు విద్యార్థి సంఘలు పిలుపు నిచ్చాయి. ఆ క్రమంలో ర్యాలీలోపాల్గొన్న వారిపై పోలీసులు వ్యవహరించిన వైఖరికి నిరసనగా బీజేపీ 12 గంటల పశ్చిమ బెంగాల్‌ బంద్‌కు పిలుపు నిచ్చింది. ఈ బంద్ సైతం హింసాత్మకంగా మారిన విషయం విధితమే. అదీకాక వైద్యురాలి మృతిపై ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన పట్ల సర్వత్ర విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి.

Also Read: Kolkata Doctor Murder Case: వైద్యురాలి తల్లిదండ్రులకు అర గంటలో మూడు ఫోన్ కాల్స్..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 30 , 2024 | 01:16 PM

Advertising
Advertising