ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CBI Officials :ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. కేజ్రీవాల్‌పై తుది చార్జిషీట్‌

ABN, Publish Date - Jul 30 , 2024 | 02:05 AM

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సీబీఐ అధికారులు సీఎం కేజ్రీవాల్‌, మరో ఐదుగురు వ్యక్తులపై తుది చార్జిషీట్‌ దాఖలు చేశారు. రౌస్‌ అవెన్యూ కోర్టులో సోమవారం ఈ మేరకు అభియోగపత్రాలను సమర్పించారు. ఇదివరకే ప్రధాన చార్జిషీట్‌, నాలుగు అనుబంధ అభియోగపత్రాలను దాఖలు చేయగా..

న్యూఢిల్లీ, జూలై 29: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సీబీఐ అధికారులు సీఎం కేజ్రీవాల్‌, మరో ఐదుగురు వ్యక్తులపై తుది చార్జిషీట్‌ దాఖలు చేశారు. రౌస్‌ అవెన్యూ కోర్టులో సోమవారం ఈ మేరకు అభియోగపత్రాలను సమర్పించారు. ఇదివరకే ప్రధాన చార్జిషీట్‌, నాలుగు అనుబంధ అభియోగపత్రాలను దాఖలు చేయగా.. తాజాగా సమర్పించిన తుది చార్జిషీట్‌లో ఈ కుంభకోణంలో కేజ్రీవాల్‌ పాత్రను గురించి వివరించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఢిల్లీలోని తన లిక్కర్‌ వ్యాపారాలకు అండగా ఉండాలని కోరుతూ 2021 మార్చి 16న సీఎం కేజ్రీవాల్‌ను కలిసినట్లు పేర్కొన్నారు.

అందుకు అనుగుణంగా లిక్కర్‌ పాలసీ ఉండేలా చూడాలని కోరారని, దానికి కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. ఇప్పటికే తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మరికొందరు అదే పనిలో ఉన్నారని, కవితను కలవాలని సూచించినట్లు చార్జిషీట్‌ స్పష్టం చేసింది.

అందుకు ప్రతిఫలంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆ్‌ప)కు ఫండ్‌ ఇవ్వాలని కేజ్రీవాల్‌ కోరినట్లు వివరించింది. ఈ క్రమంలో మద్యం ఉత్పత్తిదారులు, హోల్‌సేలర్లు, రిటైలర్లు ఓ సిండికేట్‌గా ఏర్పడి.. మధ్యవర్తులు, హవాలా ఆపరేటర్‌ ద్వారా రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఆప్‌కు అందజేసినట్లు తెలిపింది.

ఆ మొత్తాన్ని నిందితులు తిరిగి ‘ప్రాఫిట్‌ మార్జిన్‌’ రూపంలో వెనక్కి తీసుకున్నట్లు ఆరోపించింది. కాగా.. సీబీఐ అధికారులు తుది చార్జిషీట్‌లో ఆప్‌ ఎమ్మెల్యే దుర్గేశ్‌పాఠక్‌, పి.శరత్‌చంద్రారెడ్డి, అమిత్‌ అరోరా, వినోద్‌ చౌహాన్‌, ఆశి్‌షమాథుర్‌లను నిందితులుగా పేర్కొంది.

ఇదిలా ఉండగా, ఎక్సైజ్‌ కుంభకోణానికి కేజ్రీవాలే సూత్రధారని సీబీఐ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఆయన పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను సోమవారం వ్యతిరేకించింది. అయితే, ఎక్సయిజ్‌ విధానం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, దీనిపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో సహా 15 మంది సంతకాలు చేశారని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది తెలిపార

Updated Date - Jul 30 , 2024 | 02:05 AM

Advertising
Advertising
<