ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tanya Soni: చిన్ననాటి కల ఐఏఎస్.. కవిత్వాన్ని ప్రేమించేది

ABN, Publish Date - Jul 29 , 2024 | 02:49 PM

భారీ వరదల కారణంగా న్యూఢిల్లీలో బెస్‌మెంట్‌లో చిక్కుకుని ముగ్గురు సివిల్స్ ఆశావహులు మృతి చెందారు. అయితే వారిలో ఒకరైన తనియా సోని గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనియా సోని గురించి ఆమె కుటుంబ సభ్యులు ఈ సందర్బంగా పలు అంశాలను వివరించారు. 25 ఏళ్ల తనియా సోనికి కవిత్వమంటే చాలా చాలా ఇష్టమని.. ఇంకా చెప్పాలంటే కవిత్వాన్ని ఆమె బాగా ప్రేమించేదన్నారు.

పట్నా, జులై 29: భారీ వరదల కారణంగా న్యూఢిల్లీలో బెస్‌మెంట్‌లో చిక్కుకుని ముగ్గురు సివిల్స్ ఆశావహులు మృతి చెందారు. అయితే వారిలో ఒకరైన తనియా సోని గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనియా సోని గురించి ఆమె కుటుంబ సభ్యులు ఈ సందర్బంగా పలు అంశాలను వివరించారు. 25 ఏళ్ల తనియా సోనికి కవిత్వమంటే చాలా చాలా ఇష్టమని.. ఇంకా చెప్పాలంటే కవిత్వాన్ని ఆమె బాగా ప్రేమించేదన్నారు.

అలాగే ఐఏఎస్ కావడమనేది ఆమెకు చిన్నానాటి నుంచి కల కనేదని వివరించారు. అందుకోసం న్యూఢిల్లీలో ఓ కాలేజీలో చేరి పోలిటికల్ సైన్స్‌లో డిగ్రీని ఆమె అందుకుందని తెలిపారు. అనంతరం సివిల్స్ కోచింగ్ తీసుకుంటుందన్నారు. ఆ క్రమంలో ఆమె మృత్యు ఒడిలోకి చేరిందన్నారు.

Also Read:UPSC aspirants’ death: ఈ ప్రమాదానికి ముందు దృశ్యాల వీడియో వైరల్


ఇక చిన్ననాటి నుంచి చాలా చలాకీగా ఉండే ఆమె.. స్కూల్, కాలేజీ స్థాయిలో వివిధ సంస్కృతిక కార్యక్రమాల్లో సైతం పాల్గొందని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. బిహార్‌లోని ఔరంగాబాద్ ఆమె స్వస్థలం. అయితే తెలంగాణలోని సింగరేణి కాలరీస్‌లో ఆమె తండ్రి విజయకుమార్ ఉద్యోగం చేస్తున్నారన్నారు. దీంతో ఆమె తల్లిదండ్రులు తెలంగాణలో నివసిస్తున్నారని చెప్పారు. తనియా సోని మృతదేహాన్ని అంత్యక్రియలు లఖ్‌నవూలో నిర్వహిస్తామని ఆమె తండ్రి విజయకుమార్ వెల్లడించారు.

Also Read:Ravi Moun: రష్యా- ఉక్రెయిన్ యుద్దంలో హరియాణ వాసి మృతి

Also Read: Jharkhand: హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌ను సమర్థించిన సుప్రీం ధర్మాసనం


ఇక సోని తాత గారు మాట్లాడుతూ.. తనియా సోని తమ కుటుంబంలోనే అందరి కంటే తెలివైన విద్యార్థని అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆమె కజిన్ అంకిత్ మాట్లాడుతూ.. సోని చాలా చురుకు, చలాకీగా ఉండేదన్నారు. ఆమెకు డ్యాన్స్ అంటే పంచ ప్రాణాలని.. ఈ నేపథ్యంలో కాలేజీ ఫంక్షన్లలో సైతం డ్యాన్స్ చేసేందుకు ఆసక్తి చేపించేదని చెప్పారు.

Also Read: Rajasthan: సీఎంను హత్య చేస్తామంటూ బెదిరింపు.. రంగంలోకి దిగిన పోలీసులు

Also Read: UPSC aspirants’ death: లోక్‌సభలో చర్చకు కాంగ్రెస్ సిద్ధం


శనివారం సాయంత్రం ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో దేశ రాజధానిలో పలు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. ఆ క్రమంలో ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావుస్ ఐఏఎస్ భవనం బేస్‌మెంట్‌లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో లైబ్రరీలో ఉన్న పలువురు విద్యార్థులు ఈ వరద నీటిలో చిక్కుకుపోయారు. వారిలో పలువురిని రక్షించగా.. ముగ్గురు మాత్రం నీట మునిగి మరణించారు. ఈ ఘటనలో ఇప్పటికి ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో మౌలిక సదుపాయాల కల్పనలో లోపాల కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందంటూ సర్వత్రా విమర్శులు సైతం వ్యక్తమవుతున్నాయి.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 29 , 2024 | 03:06 PM

Advertising
Advertising
<