ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిషి.. స్పందించిన స్వాతి

ABN, Publish Date - Sep 17 , 2024 | 03:11 PM

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన వారసులుగా అతిషిని ఎంపిక చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఆప్ నిర్ణయంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ స్పందించారు.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన వారసులుగా అతిషిని ఎంపిక చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఆప్ నిర్ణయంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ స్పందించారు. అతిషి కేవలం డమ్మీ సీఎం అని ఆమె పేర్కొన్నారు. ఉగ్రవాది అఫ్జల్ గురు విషయంలో అతిషి తల్లిదండ్రులు వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా ఎంపీ స్వాతి మలివాల్ ఎండగట్టారు.

Also Read: History of Balapur Laddu: బాలాపూర్ లడ్డూ చరిత్ర ఇదే..

Also Read: Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. భారీగా పెరిగిన వెండి రేటు


ఉగ్రవాది అఫ్జల్ గురుకి ఉరిశిక్ష నుంచి తప్పించేందుకు అతిషి తల్లిదండ్రులు చాలా కాలం పోరాడారని గుర్తు చేసింది. చివరకు అఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రకటించాలంటూ అతిషి తల్లిదండ్రులు భారత రాష్ట్రపతికి లేఖ సైతం రాశారని తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే అఫ్జల్‌ గురికి ఈ శిక్ష పడిందంటూ ఆ లేఖలో వారు ప్రస్తావించిన విషయాన్నిఈ సందర్భంగా ఎంపీ స్వాతి మలివాల్ వివరించారు.

Also Read: Atishi: అతిషి పోలిటికల్ ఎంట్రీ ఎలా జరిగిందంటే..?

Also Read: టెలిఫోన్ భవన్ చేరుకున్న బడా గణపతి


ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి నియమించే విషయంలో దేశ భద్రతను పరిగణలోకి తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఏదీ ఏమైనా ఢిల్లీని ఆ దేవుడే రక్షించాలని ఎంపీ స్వాతి మలివాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్వాతి మలివాల్ స్పందించారు.

Also Read: Ganesh Visarjan 2024: ముంబయిలో గణేశ్‌ని నిమజ్జనం


సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం తీహాడ్ జైలు నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విడుదలయ్యారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన సహాయకుడు బిభవ్ కుమార్.. స్వాతి మలివాల్‌పై దాడి చేశాడు. ఈ నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి బిభవ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అతడు సైతం తీహాడ్‌ జైలుకు వెళ్లారు. బిభవ్ కుమార్ సైతం ఇటీవలే బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.

Also Read: New York: స్వామినారాయణ్ ఆలయంపై దాడి: ఖండించిన భారత్

Also Read: Kolkata: మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. ఘోష్ ఫామ్ హౌస్‌లో ఈడీ సోదాలు


మంగళవారం న్యూఢిల్లీలో పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం కేజ్రీవాల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి పేరును ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆప్ ఎమ్మెల్యేలంతా ఆమోదించారు.

For More National News and Telugu News

Updated Date - Sep 17 , 2024 | 03:16 PM

Advertising
Advertising