Share News

IAS aspirants’ death in Delhi: మృతులు ముగ్గురు కాదు.. 10 నుంచి 12 మంది..

ABN , Publish Date - Jul 31 , 2024 | 10:27 AM

న్యూఢిల్లీలో వరద నీటిలో చిక్కుకుని మృతి చెందిన సివిల్స్ విద్యార్థులకు భద్రత కల్పించే విషయంలో కోచింగ్ సెంటర్ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించాయని బిహార్ ఎంపీ పప్పు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతులు ముగ్గురని ప్రకటించినప్పటికి ఆ సంఖ్య మరింత ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

IAS aspirants’ death in Delhi: మృతులు ముగ్గురు కాదు..  10 నుంచి 12 మంది..

న్యూఢిల్లీ, జులై 31: న్యూఢిల్లీలో వరద నీటిలో చిక్కుకుని మృతి చెందిన సివిల్స్ విద్యార్థులకు భద్రత కల్పించే విషయంలో కోచింగ్ సెంటర్ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించాయని బిహార్ ఎంపీ పప్పు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతులు ముగ్గురని ప్రకటించినప్పటికి ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Also Read: Sindhudurg: లలిత భర్త సతీశ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు


మృతులు 10 నుంచి 12 మంది వరకు ఉండవచ్చు..

అయితే ఈ ఘటన జరిగిన చోటు చేసుకున్న అనంతరం 10 నుంచి 12 మంది విద్యార్థుల ఆచూకీ తెలియకుండా పోయిందన్నారు. దేశ వ్యాప్తంగా కోచింగ్ సెంటర్లు విద్యార్థులను నిలువునా దోపిడి చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వాటిని అరికట్టేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని ఈ సందర్బంగా ప్రభుత్వానికి ఆయన విజ్జప్తి చేశారు.

Also Read: Wayanad landslides: 143కు చేరిన మృతులు.. రాహుల్, ప్రియాంక పర్యటన వాయిదా


గత వారం...

శనివారం సాయంత్రం దేశ రాజధాని న్యూఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలను వరద నీరు చుట్టుముట్టింది. ఆ క్రమంలో ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ సెంటర్ బెస్‌మెంట్‌లోకి వరద నీరు చుట్టిముట్టడంతో.. ముగ్గురు సివిల్స్ ఆశావహులు మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై విమర్శుల సైతం వెల్లువెత్తాయి. ఆ క్రమంలో ఆప్ ప్రభుత్వమే లక్ష్యంగా బీజేపీ ఆరోపణలు గుప్పించింది. ఇక ఢిల్లీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఢిల్లీలో నిబంధనలు పాటించని పలు సివిల్స్ కోచింగ్ సెంటర్లకు సీల్ వేసింది.


ఈ నేపథ్యంలో ఆ యా కోచింగ్ సెంటర్ల యాజమాన్యం ప్రభుత్వ చర్యలపై మండిపడుతుంది. కొన్ని కోచింగ్ సెంటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. మిగిలిన వాటిని సైతం అదే దృష్టితో చూడడం సరికాదని సివిల్స్ కోచింగ్ సెంటర్ల యాజమాన్యం స్పష్టం చేస్తున్నాయి.


ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం..

రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌కు సంబంధించిన ఇప్పటి వరకు ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ సివిల్స్ విద్యార్థుల మృతిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మృతి చెందిన ముగ్గురు సివిల్స్ విద్యార్థుల స్వస్థలం.. కేరళ, ఉత్తరప్రదేశ్, తెలంగాణ. కాగా ఈ ఘటనపై పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 31 , 2024 | 11:41 AM