Share News

Ayodhya : అయోధ్యలో రూ. 50 లక్షల విలువైన వీధి బల్బులను ఎత్తుకెళ్లిన దొంగలు

ABN , Publish Date - Aug 15 , 2024 | 04:24 AM

రామ జన్మభూమి అయోధ్యలో దొంగలు రూ.50 లక్షల విలువైన వీధి బల్బులను ఎత్తుకెళ్లారు. ఎల్లప్పుడూ భద్రతా సిబ్బంది కనుసన్నల్లో ఉండే భక్తి పథ్‌, రామ్‌ పథ్‌ మార్గాల వెంబడి వెదురు కర్రలకు అమర్చిన 3800

Ayodhya : అయోధ్యలో రూ. 50 లక్షల విలువైన వీధి బల్బులను ఎత్తుకెళ్లిన దొంగలు

అయోధ్య, ఆగస్టు 14: రామ జన్మభూమి అయోధ్యలో దొంగలు రూ.50 లక్షల విలువైన వీధి బల్బులను ఎత్తుకెళ్లారు. ఎల్లప్పుడూ భద్రతా సిబ్బంది కనుసన్నల్లో ఉండే భక్తి పథ్‌, రామ్‌ పథ్‌ మార్గాల వెంబడి వెదురు కర్రలకు అమర్చిన 3800 బల్బులను, 39 ప్రొజెక్టర్‌ బల్బులను దోచుకెళ్లారు. అయోధ్య అభివృద్ధి సంస్థ ద్వారా యష్‌ ఎంటర్‌ప్రైజెస్‌, కృష్ణ ఆటోమొబైల్స్‌ కంపెనీలు కాంట్రాక్ట్‌ తీసుకుని రామ్‌ పథ్‌ మారం్గలో 6400 వెదురు కర్రల బల్బులను, భక్తి పథ్‌ మారం్గలో 96 ప్రొజెక్టర్‌ బల్బులను ఏర్పాటు చేశాయి. మే నెలలో తనిఖీలు చేపట్టగా వెదురు కర్రలకు అమర్చిన 3800 బల్బులు, 39 ప్రొజెక్టర్‌ బల్బులు పోయినట్లు తెలుసుకున్నాయి. అయితే దాదాపు రెండు నెలలు ఆలస్యంగా ఈ నెల 9న పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

Updated Date - Aug 15 , 2024 | 04:24 AM