ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP: బీజేపీని చూసి దేశభక్తి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు.. సీఎం కామెంట్స్

ABN, Publish Date - Mar 01 , 2024 | 02:18 PM

కేంద్ర ప్రభుత్వ తీరుపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ (BJP) నుంచి దేశభక్తి నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ప్రభుత్వ తీరుపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ (BJP) నుంచి దేశభక్తి నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ పాల్గొనలేదని కుండబద్ధలు కొట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదు. స్వాతంత్య్ర పోరాటం తీవ్రరూపం దాల్చినప్పుడూ సంఘ్‌ పరివార్‌కు చెందిన కేశవ్‌ బలిరామ్‌ హెడ్గేవార్‌, ఎంఎస్‌ గోల్‌వాల్కర్‌ పాల్గొనలేదు. బీజేపీ నుంచి దేశభక్తి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మతం పేరుతో దేశాన్ని, సమాజాన్ని విడదీస్తోంది బీజేపీనేనని సీఎం సిద్ధా రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఓడిస్తారని ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అనేది కేవలం నినాదం మాత్రమేనని, కమలం పార్టీలోని వ్యక్తులు దేశాన్ని పరిపాలించడానికి తగినవారా అని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు హామీలను సైతం అమలు చేసిందని చెప్పారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2024 | 02:19 PM

Advertising
Advertising