ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata Trainee Doctor Case: కోల్‌కతా డాక్టర్ కేసులో నేడు కీలక విచారణ.. రూట్ మార్చిన నిందితుడు

ABN, Publish Date - Aug 25 , 2024 | 08:12 AM

కోల్‌కతా అత్యాచారం, హత్య కేసులో విచారణలో నిందితుడు సంజయ్ రాయ్ తన నేరాన్ని అంగీకరించాడని కోల్‌కతా పోలీసులు గతంలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు నిందితుడు మాత్రం తనను ఇరికిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే నేడు CBI ప్రధాన నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్షను నిర్వహించనుంది.

Sanjay Roy polygraph test today

కోల్‌కతా(Kolkata)లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు(trainee doctor case) ఇప్పట్లో తేలే లా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌(sanjay roy) రూట్ మార్చినట్లు తెలుస్తోంది. విచారణలో గతంలో తానే చేశానని పోలీసులు చెప్పగా, ఇప్పుడు మాత్రం ఈ హత్యకు తనకు సంబంధం లేదని, ఇరికిస్తున్నారని చెబుతున్నాడు. నిందితుడు సంజయ్ రాయ్‌ను కస్టడీ నేపథ్యంలో ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్‌లోని సెల్ నంబర్ 21లో ఉంచారు. సెల్ బయట సీసీటీవీ కెమెరాలను కూడా అమర్చారు. అయితే జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నేరం గురించి తనకేమీ తెలియదని నిందితుడు సంజయ్ రాయ్ సెక్యూరిటీ గార్డులకు చెప్పాడని అన్నారు.


నేడు తేలనుందా..

అయితే ఈ కేసులో సీబీఐ మరో ఆరుగురికి శనివారం పాలీగ్రాఫ్ పరీక్ష(polygraph test) నిర్వహించింది. సంఘటన జరిగిన రోజు రాత్రి విధుల్లో ఉన్న మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, నలుగురు వైద్యులు, ఒక పౌర వాలంటీర్‌తో సహా మిగిలిన ఆరుగురు వ్యక్తులను ఏజెన్సీ కార్యాలయంలో పరీక్షించారు. సాంకేతిక కారణాల వల్ల ప్రధాన నిందితుడు సంజయ్‌కి పాలిగ్రాఫ్ పరీక్ష వాయిదా పడింది. ఈ క్రమంలో నేడు సంజయ్ రాయ్ కి పాలిగ్రాఫ్ పరీక్షను నిర్వహించనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL) నుంచి పాలిగ్రాఫ్ నిపుణుల బృందం ఈ పరీక్షలను నిర్వహించేందుకు కోల్‌కతాకు చేరుకుందని అధికారులు తెలిపారు. ఫెడరల్ ఏజెన్సీ దర్యాప్తు చేపట్టే సమయానికి కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసును దాచిపెట్టడానికి స్థానిక పోలీసులు ప్రయత్నించారని సీబీఐ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది.


రాయ్ ప్రకటనల్లో తేడా

అయితే కోల్‌కతా పోలీసులు, సీబీఐ రెండూ అతని వాంగ్మూలాలలో అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం నిందితులు వివరించలేని లేదా ధృవీకరించలేని అంశాలు అనేకం ఉన్నాయి. దర్యాప్తు అధికారులు నేరస్థలం నుంచి కనీసం 40 సాక్ష్యాలను సేకరించారని, ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీని భద్రపరిచామని, నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కానీ సంజయ్ మాత్రం ఈ హత్య తాను చేయలేదని చెబుతున్నాడు. ఈ కేసు గురించి తనకేమీ తెలియదని అంటున్నాడు. ఈ నేపథ్యంలో నేటి పాలీగ్రాఫ్ టెస్టులో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి మరి. పాలీగ్రాఫ్ పరీక్ష నివేదిక వచ్చిన తర్వాత సీబీఐ(CBI) బృందం దర్యాప్తును కొనసాగిస్తుంది.


ఇంకా నిరసనలు

ఆగస్టు 9న ఉదయం కోల్‌కతాలోని ఆర్‌జి కర్ హాస్పిటల్‌లో(RG Kar Medical College and Hospital) 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ మహిళా డాక్టర్ మృతదేహం కనుగొనబడింది. నివేదికల ప్రకారం డాక్టర్ అత్యాచారం తర్వాత హత్య చేయబడింది. ఈ దారుణ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. ఈ వ్యవహారాన్ని సుప్రీమ్ కోర్ట్ స్వయంగా సుమోటాగా స్వీకరించింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా టోలీగంజ్‌లో నిన్న పశ్చిమ బెంగాల్ మోషన్ పిక్చర్స్ ఆర్టిస్టులు నిరసన తెలిపారు. ఈ కేసు విషయంలో నిందితులను కఠినంగా శిక్షించాలని, అవసరమైతే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

Dhaka : ఇండో-బంగ్లా సరిహద్దుల్లో ఉద్రిక్తత

Bengaluru : బీమా సొమ్ము కోసం చనిపోయినట్టుగా నాటకం


Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 25 , 2024 | 08:14 AM

Advertising
Advertising
<