ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nawaz congrats PM Modi: ద్వేషాన్ని ఆశతో భర్తీ చేద్దాం.. మోదీకి నవాజ్ షరీఫ్ అభినందన సందేశం

ABN, Publish Date - Jun 10 , 2024 | 06:58 PM

భారతదేశ ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీకి దాయాది దేశమైన పాకిస్థాన్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నరేంద్ర మోదీ సారథ్యంలోని 3.0 ప్రభుత్వానికి పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోమవారంనాడు అభినందనలు తెలిపారు. ''ద్వేషాన్ని ఆశతో భర్తీ చేద్దాం'' అని మోదీకి పంపిన అభినందన సందేశంలో నవాజ్ షరీఫ్ అభిలషించారు.

న్యూఢిల్లీ: భారతదేశ ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ (Naredndra Modi)కి దాయాది దేశమైన పాకిస్థాన్ (Pakistan) నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నరేంద్ర మోదీ సారథ్యంలోని 3.0 ప్రభుత్వానికి పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) సోమవారంనాడు అభినందనలు తెలిపారు. ''ద్వేషాన్ని ఆశతో భర్తీ చేద్దాం'' అని మోదీకి పంపిన అభినందన సందేశంలో నవాజ్ షరీఫ్ అభిలషించారు.


నరేంద్ర మోదీ ఆదివారంనాడు తన మంత్రివర్గ సహచరులతో ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో నవాజ్ తన సందేశాన్ని పోస్ట్ చేశారు. ''మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన మోదీకి నా ఆత్మీయ అభినందనలు. మీ నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసాన్ని ప్రతిబింబించేలా మీ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. ద్వేషం స్థానే ఆశావహ దృక్పథం చోటుచేసుకుంటుందని ఆశిస్తు్న్నాను'' అని ఆయన పేర్కొన్నారు.

Shehbaz Sharif congrats Modi: 'హ్యాట్రిక్' మోదీకి అభినందనలు తెలిపిన పాక్ ప్రధాని


దీనికి ముందు, భారతదేశ ప్రధానమంత్రిగా మూడోసారి చారిత్రక విజయం సాధించి భాద్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ (Narendra Modi)కి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) అభినందనలు తెలిపారు. ''ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్న మీకు అభినందనలు'' అని సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో షెహబాజ్ ట్వీట్ చేశారు.


అభినందనలకు మొదట్లో మొరాయించిన పాక్..

రాష్ట్రపతి భవన్‌లో ఆదివారంనాడు అత్యంత కోలాహలంగా జరిగిన నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి పొరుగు దేశాలైన మాల్దీవులు, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, మారిషస్, నేపాల్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇస్లామాబాద్‌కు మాత్రం ఈసారి ఆహ్వానం పంపలేదు. ఎన్డీయే గెలుపు అనంతరం పాక్ నుంచి మోదీకి ఎలాంటి అభినందలు రాలేదు. దీనిపై విదేశీ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జెహ్రా బలోజ్‌ గతవారంలో స్పందిస్తూ, కొత్త ప్రభుత్వం అధికారికంగా ప్రమాణస్వీకారం చేయనందున భారత ప్రధానిని అభినందించడం ప్రీ-మెచ్యూర్ అవుతుందని వ్యాఖ్యానించారు. ఇండియాతో సహా ఇరుగుపొరుగు దేశాలతో ఇస్లామాబాద్ సత్సంబంధాలు కోరుకుంటున్నట్టు ఆమె తెలిపారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం కావాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. 2014లో బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోదీ ప్రధానిగా స్వీకారం చేసినప్పుడు అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సహా హాజరయ్యారు. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను భారత ప్రభుత్వం రద్దు చేయడంతో ఆ నిర్ణయాన్ని అంతర్జాతీయ వేదకలపై ప్రస్తావించేందుకు పాక్ ప్రయత్నాలు చేసింది. అయితే, పాక్ ప్రయత్నాలకు అంతర్జాతీయ దేశాల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఇప్పటికే ఇరుదేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సస్పెండ్ చేశాయి.

Read More National News and Latest Telugu News

Read more!

Updated Date - Jun 10 , 2024 | 06:58 PM

Advertising
Advertising