ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Narendra Modi: ప్రధాని మోదీకి సీఎం కౌంటర్.. ఆ హామీల సంగతేంటి?

ABN, Publish Date - May 12 , 2024 | 03:49 PM

ఒడిశాలోని జిల్లాల పేర్లు చెప్పాలంటూ ప్రధాని మోదీ చేసిన సవాల్‌పై బిజు జనతాదళ్ (బీజేడీ) చీఫ్, సీఎం నవీన్ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు. అసలు మీకు ఒడిశా గుర్తుందా?

ఒడిశాలోని జిల్లాల పేర్లు చెప్పాలంటూ ప్రధాని మోదీ (PM Modi) చేసిన సవాల్‌పై బిజు జనతాదళ్ (బీజేడీ) చీఫ్, సీఎం నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) తీవ్రంగా స్పందించారు. అసలు మీకు ఒడిశా గుర్తుందా? అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒడియా శాస్త్రీయ బాష అయినప్పటికీ దాన్ని మోదీ మరిచారని, ఒడిస్సీ క్లాసికల్ సంగీతంపై తాను చేసిన ప్రతిపాదనలను కూడా రెండుసార్లు తిరస్కరించారని దుయ్యబట్టారు. తాను విడుదల చేసిన 3 నిమిషాల వీడియోలో ఆయన మోదీపై ఇలా కౌంటర్ ఎటాక్ చేశారు.

డొనాల్డ్ ట్రంప్‌కి షాకిచ్చిన శృంగార తార.. ఆరోజు హోటల్ రూమ్‌లో..

‘‘మోదీజీ.. నన్ను జిల్లాల పేర్లు అడుగుతున్న మీకు అసలు ఒడిశా గుర్తుందా? ఒడియా శాస్త్రీయ భాష అయినా, దాని గురించి మీరు పూర్తిగా మర్చిపోయారు. సంస్కృతానికి రూ.1000 కోట్లు కేటాయించారు కానీ, ఒడియాకు మాత్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు’’ అని నవీన్ పట్నాయక్ ఆ వీడియోలో పేర్కొన్నారు. తాను క్లాసికల్ ఒడిస్సీ సంగీత గుర్తింపు విషయమై రెండుసార్లు ప్రతిపాదనలను గతంలో పంపించానని.. కానీ వాటిని తిరస్కరించారని ఆయన మండిపడ్డారు. ఒడిశాకు ఒడియా భాష, సంస్కృతిని అర్థం చేసుకునే ముఖ్యమంత్రి కావాలంటూ ఉద్ఘాటించారు.


ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం.. ఎయిర్‌పోర్టులోనే చిన్నారి మృతదేహం

ఇదే సమయంలో.. ఒడిశాలో సహజ వనరులు ఎన్నో ఉన్నా ఆ రాష్ట్ర ప్రజలు పేదలుగా ఎందుకున్నారని ప్రధాని మోదీ సంధించిన ప్రశ్నకు కూడా నవీన్ పట్నాయక్ బదులిచ్చారు. ఒడిశా సహజ సంపద బొగ్గు అని, కేంద్రం ఆ బొగ్గుని తీసుకుంటుందని, కానీ గత పేదేళ్లలో బొగ్గుపై రాయల్టీని పెంచడం మర్చిపోయారని తూర్పారపట్టారు. కేవలం ఎన్నికల సమయంలో ఒడిశాను గుర్తు చేసుకుంటే ప్రయోజనం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల చాలామందికి భారతరత్న ఇచ్చిన కేంద్రం.. ఒడిశా వీర కుమారులను ఎందుకు మరిచిపోయిందని నిలదీశారు.

ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ ‘న్యూక్లియర్’ వార్నింగ్

అలాగే.. ఒడిశా రాష్ట్రానికి 2014, 2019లో ప్రధాని మోదీ చేసిన వాగ్ధానాలను కూడా నవీన్ పట్నాయక్ గుర్తు చేశారు. నిత్యావసర ధరలు తగ్గిస్తామని.. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని.. ఎల్‌పీజీ, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని.. అందరికీ మొబైల్ కనెక్టివిటీ కల్పిస్తామని.. మోదీ వాగ్ధానాలు ఇచ్చారని.. కానీ అవేవీ పూర్తి చేయలేదని పేర్కొన్నారు. జూన్ 10వ తేదీనే కాదు.. మరో పదేళ్లలోనూ ఏమీ జరగదని.. ఒడిశా ప్రజల హృదయాలను బీజేపీ గెలచుకోలేదని నవీన్ పట్నాయక్ చెప్పుకొచ్చారు.

Updated Date - May 12 , 2024 | 03:49 PM

Advertising
Advertising