ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Prashant Kishor: RJDకి ప్రశాంత్ కిషోర్ సవాల్.. ముస్లిం సీట్ల విషయంలో కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Sep 01 , 2024 | 08:56 PM

రాజకీయ వ్యూహకర్త, జన్ సూరజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ తన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు బహిరంగ చర్చల సందర్భంగా చాలాసార్లు బీహార్‌(bihar)లో ప్రకటించారు. కానీ తాజాగా మాత్రం RJD నేత తేజస్వి యాదవ్‌కు సవాల్ విసిరారు. అయితే ఏమన్నారనేది ఇక్కడ తెలుసుకుందాం.

Prashant Kishor challenge to rjd

వచ్చే ఏడాది బీహార్‌(bihar)లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేశాయి. మరోవైపు రాజకీయ వ్యూహకర్త, జన్ సూరజ్ అధినేత ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) తన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు బహిరంగ చర్చల సందర్భంగా చాలాసార్లు ప్రకటించారు. వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రజలతో మమేకమయ్యాక ఆయన ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ప్రశాంత్ కిషోర్ తన పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, రిటైర్డ్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఆయనతో జతకట్టారు. కానీ తాజాగా ప్రశాంత్ కిషోర్ బీహార్ పొలిటికల్ కారిడార్‌లలో రాజకీయ అంశాలపై చర్చ కొనసాగిస్తున్నారు.


సవాల్

ఈ నేపథ్యంలో RJD నేత తేజస్వి యాదవ్‌కు పీకే సవాల్ విసిరారు. మీరు నిజంగా ముస్లింల హక్కులను విశ్వసిస్తే రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 40 మంది ముస్లిం అభ్యర్థులను పోటీకి దింపాలన్నారు. వారి హక్కులను లాక్కోవడం మానేసి, వారి జనాభా ప్రకారం టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే జనాభా ప్రకారం టిక్కెట్లు ఇచ్చి చూపించాలన్నారు. ఆర్జేడీ ఏం చేయాలనుకుంటే అది చేయాల్సిందే అంటూ పీకే స్టేట్ మెంట్ ఇచ్చారు. మా పోరాటం ఆర్జేడీతో కాదు. ఎన్డీయేతోనే అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, ఎన్డీయే 176 స్థానాల్లో ముందంజలో ఉందని, ఆర్జేడీని ఎవరు అడుగుతున్నారని పీకే ఎద్దేవా చేశారు. పోరు మాకూ, ఎన్డీయేకూ మధ్యనే ఉంటుందన్నారు.


వీరికి 18 శాతం

ఈ నేపథ్యంలో తమ పార్టీలో ముస్లింల భాగస్వామ్యం 18 శాతం ఉంటుందని జన్ సూరజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (PK) వ్యాఖ్యానించారు. దళితులతో పోలిస్తే ముస్లింలు అనేక విధాలుగా వెనుకబడి ఉన్నారని, నాయకులను ఎన్నుకోవడంలో ఈ సంఘం తప్పు చేసిందన్నారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (IPAC) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఇటిల ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. రాష్ట్రీయ జనతాదళ్ (RJD)ని ఆరోపిస్తూ లాలూ ప్రసాద్ పార్టీ ముస్లింలలో భారతీయ జనతా పార్టీ (BJP) పట్ల భయాన్ని కలిగించిందని అన్నారు.


కాంగ్రెస్‌పై కౌంటర్

దేశాన్ని కాంగ్రెస్ ఎక్కువ కాలం పాలించిందని, అందులో ముస్లింలు, అత్యంత వెనుకబడిన ప్రజలు, దళితులు చాలా వెనుకబడి ఉన్నారని పీకే అన్నారు. జాన్ సూరజ్ ఏ ఒక్క మతానికి లేదా కులానికి చెందినది కాదన్నారు. దీని ద్వారా ప్రజలు రాజకీయ బంధిత కార్మికుల నుంచి బయటపడతారని పీకే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీహార్ ప్రజలు బాగుపడాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. కులం లేకుండా అర్థం చేసుకునే రాజకీయాలు ఉండవని అన్నారు. పరోక్షంగా కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆలోచనలపై పనిచేస్తుంటే, మేము మహాత్మా గాంధీ ఆలోచనలపై పని చేస్తున్నామని వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి:

Vande Bharat Sleeper Coaches: వందే భారత్ స్లీపర్ కోచ్‌లను రిలీజ్ చేసిన మంత్రి.. వీటి స్పెషల్ ఏంటంటే..

TMC: టీఎంసీకి ఎదురుదెబ్బ.. అసోం పార్టీ అధ్యక్షుడు రాజీనామా

Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలివే.. షేర్ మార్కెట్‌లో మనీ సంపాదించే ఛాన్స్

Read More National News and Latest Telugu News

Updated Date - Sep 01 , 2024 | 08:59 PM

Advertising
Advertising