Share News

UP Car accident: కారు ప్రమాదంలో గాయపడిన మంత్రి కొడుకు, కోడలు

ABN , Publish Date - Jul 30 , 2024 | 08:22 PM

ఉత్తరప్రదేశ్ మంత్రి నంద్ గోపాల్ నంది కుమారుడు, కోడలు మంగళవారంనాడు జరిగిన కారు ప్రమాదంలో గాయపడ్డారు. వీరిని హుటాహుటిన లక్నోలోని ఆసుపత్రికి తరలించారు.

UP Car accident: కారు ప్రమాదంలో గాయపడిన మంత్రి కొడుకు, కోడలు

లక్నో: ఉత్తరప్రదేశ్ మంత్రి నంద్ గోపాల్ నంది (Nand Gopal Nandi) కుమారుడు, కోడలు మంగళవారంనాడు జరిగిన కారు ప్రమాదంలో గాయపడ్డారు. వీరిని హుటాహుటిన లక్నోలోని ఆసుపత్రికి తరలించారు.

Uttar Pradesh: కఠిన 'లవ్ జిహాద్' బిల్లుకు యోగి సర్కార్ ఆమోదం.. దోషులకు ఇక యావజ్జీవం


మంత్రి కుమారుడు నడుపుతున్న మెర్సిడెజ్ కారు అదుపుతప్పి డివైడర్‌ను తాకడంతో కారు బోల్తా పడింది. ఈ తీవ్రతకు కారు బాగా దెబ్బతినడంతో పాటు ఎడం వైపు టైరు వాహనం నుంచి విడిపోయింది. లక్నో-ఆగ్రా హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లక్నో నుంచి ఆగ్రాకు వెళ్తుండగా కారు ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. వర్షం పడి రోడ్డు జారుడుగా ఉండటంతో కారు బోల్తాపడి ఉండవచ్చని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. కారు బోల్తాపడగానే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి గాయపడిన ఇద్దరినీ బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలో పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రిగా నంద్ గోపాల్ నంది ఉన్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 30 , 2024 | 08:22 PM