ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttarakhand :కొండచరియలు విరిగిపడి.. ఇద్దరు హైదరాబాదీల మృతి

ABN, Publish Date - Jul 07 , 2024 | 02:45 AM

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యాత్రికుల ప్రాణాలను బలిగొన్నాయి. శనివారం బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై కర్ణప్రయాగ్‌కు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

  • ఉత్తరాఖండ్‌లో దుర్ఘటన

గోపేశ్వర్‌, జూలై 6: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యాత్రికుల ప్రాణాలను బలిగొన్నాయి. శనివారం బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై కర్ణప్రయాగ్‌కు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సత్యనారాయణ(50), నిర్మల్‌ షాహి(36) అనే యాత్రికులు బద్రీనాథ్‌ ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా.. కొండచరియలు విరిగి వారిపై పడ్డాయి. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. బండరాళ్లను తొలగించి వారి మృతదేహాలను వెలికితీసినట్లు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో కొద్దిరోజులుగా భారీవర్షాలు కురుస్తుండడంతో బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై పలుచోట్ల కొండచరియలు విరిగిపడి రాకపోకలకు ఆటంకం కలుగుతున్నట్లు చెప్పారు.

Updated Date - Jul 07 , 2024 | 02:49 AM

Advertising
Advertising
<