ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మమతకు భారత్‌ సేవాశ్రమ్‌ సంఘ్‌ నోటీసులు

ABN, Publish Date - May 21 , 2024 | 04:34 AM

తమ సంస్థ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ముర్షిదాబాద్‌లోని భారత్‌ సేవాశ్రమ్‌ సంఘ్‌కు చెందిన స్వామి ప్రదీప్తానంద మహరాజ్‌ పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీకి......

కోల్‌కతా, మే 20: తమ సంస్థ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ముర్షిదాబాద్‌లోని భారత్‌ సేవాశ్రమ్‌ సంఘ్‌కు చెందిన స్వామి ప్రదీప్తానంద మహరాజ్‌ పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీకి సోమవారం లీగల్‌ నోటీసులు పంపారు. మమత తనను వ్యక్తిగతంగా విమర్శించారని, ఆధ్యాత్మిక నేతలమైన తాము అలాంటి వాటిని పట్టించుకోమని ప్రదీప్తానంద మహరాజ్‌ తెలిపారు.

కానీ, సేవా కార్యక్రమాలు నిర్వహించే తమ సంస్థపై నిందలు వేస్తే సహించమని అందుకే నోటీసులు పంపామని వివరించారు. ఆరమ్‌భాగ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మమత మాట్లాడుతూ.. రామకృష్ణ మిషన్‌, భారత్‌ సేవాశ్రమ్‌ సంఘ్‌కు చెందిన కొందరు వ్యక్తులు ఢిల్లీలోని బీజేపీ నేతల కోసం పని చేస్తున్నారని ఆరోపించారు.

Updated Date - May 21 , 2024 | 04:34 AM

Advertising
Advertising