తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం కుప్పంలో పర్యటించి.. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం అభివృద్ధికి 35 ఏళ్ల పాటు తాను పడిన కష్టాన్ని కేవలం ఐదేళ్ల వైసీపీ పాలనలో సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే తిరిగి అభివృద్ధిని పట్టాలెక్కిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనికి అవసరమైన అన్ని ప్రణాళికలు రచించి అమలు చేస్తామని చెప్పారు. అలాగే వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.