ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీవారి ఆలయం వద్ద గోల్డ్ మ్యాన్ల హల్చల్..

ABN, Publish Date - Aug 23 , 2024 | 12:16 PM

తిరుపతి: శ్రావణమాసం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. దీంతోపాటు పెళ్లిళ్లు జరుగుతుండటంతో కొత్త జంటలు కూడా స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకునేందుకు వస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవారి ఆలయం వద్ద ఇద్దరు గోల్డ్ మ్యాన్లు హల్చల్ చేశారు. ఈరోజు శ్రావణమాసం మూడో శుక్రవారం కావడంతో పూణేకు చెందిన సన్నీ వాగచోరీ, సంజయ్ గుజర్‌లు స్వామివారిని దర్శించుకున్నారు. మెడ నిండా బంగారు చైన్లు.. చేతి నిండా బంగారు కవచాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు వారు 20 కేజీల బంగారాన్ని ధరించారు. స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన గోల్డ్ మ్యాన్లను చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు. కొంతమంది భక్తులు వారితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. వారు ప్రయాణించే కారు కూడా గోల్డ్ కలర్‌లో ఉంది.

1/5

పూణేకు చెందిన సన్నీ వాగచోరీ, సంజయ్ గుజర్‌లు (గోల్డ్ మ్యాన్లు) తిరుమల శ్రీవారి ఆలయం వద్ద హల్చల్..

2/5

శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బయటకు వచ్చిన గోల్డ్ మ్యాన్లు.. మహిళ ధరించిన చీర, బాబు వేసుకున్న చొక్కా కూడా గోల్డ్..

3/5

గోల్డ్ మ్యాన్లు ప్రయాణం చేసే కారు కూడా గోల్డ్ కలర్ కావడం విశేషం..

4/5

తిరుమలలో గోల్డ్ మ్యాన్లను చూసి ఆశ్చర్యపోయిన భక్తులు.. వారితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి..

5/5

శ్రావణమాసం మూడో శుక్రవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది.

Updated Date - Aug 23 , 2024 | 12:59 PM

Advertising
Advertising