తూ.గో. జిల్లా: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా బుధవారం తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురంలో రోడ్ షో నిర్వహించారు. పసుపు, ఎరుపు, కాషాయ రంగులతో ఆ ప్రాంతం కళకళలాడింది. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. వేలాదిగా తరలివచ్చిన కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులతో రోడ్ షో అదిరిపోయింది. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారరథంపై నుంచి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం అరాచకం, నీచరాజకీయాలు, వైఫల్యాలను ఎండగట్టారు.