20 సూత్రాల కార్యక్రమం అమలు ఛైర్మన్‌గా లంకా దినకర్

ABN, Publish Date - Oct 20 , 2024 | 08:40 AM

అమరావతి: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047 అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది పర్చాలనే లక్ష్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల సాధన దిశగా 20 సూత్రాల కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర బీజేపి పెద్దల సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఈ బాధ్యతలను చేపట్టడం జరిగిందంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

20 సూత్రాల కార్యక్రమం అమలు ఛైర్మన్‌గా లంకా దినకర్ 1/6

స్వర్ణాంధ్ర @ 2047 విజన్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన లంకా దినకర్..

20 సూత్రాల కార్యక్రమం అమలు ఛైర్మన్‌గా లంకా దినకర్ 2/6

రాష్ట్ర సచివాలయంలో పూజలు నిర్వహిస్తున్న 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్

3/6

చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన లంకా దినకర్‌కు ఆశీర్వచనాలు అందిస్తున్న వేద పండితులు..

4/6

20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన లంకా దినకర్‌కు పూలమాల వేసి అభినందనలు తెలుపుతున్న పలువురు నేతలు..

5/6

ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న లంకా దినకర్..

6/6

ఛైర్మన్ అయిన సందర్భంగా లంకా దినకర్‌కు పలువురు నేతలు స్వీట్స్ తినిపిస్తూ.. అభినందనలు తెలుపుతున్న దృశ్యం..

Updated Date - Oct 20 , 2024 | 08:40 AM