Virat Kohli: కోహ్లీని కలిసేందుకు లక్నో నుంచి ముంబైకి నడచుకుంటూ వెళ్తున్న అభిమాని
ABN, Publish Date - Feb 20 , 2024 | 02:11 PM
కింగ్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రన్మెషీన్ కోహ్లీ బ్యాటింగ్కు ఫిదా అయిపోయిన వారు చాలా మంది అతనికి వీరాభిమానులుగా మారిపోయారు.
కింగ్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రన్మెషీన్ కోహ్లీ బ్యాటింగ్కు ఫిదా అయిపోయిన వారు చాలా మంది అతనికి వీరాభిమానులుగా మారిపోయారు. కోహ్లీ మీద ఉన్న అభిమానంతో చాలా మంది కేవలం అతడి కోసమే స్టేడియాలకు వస్తుంటారు. విరాట్ బ్యాటింగ్ చేస్తున్నాడంటే చాలు స్టేడియం మొత్తం కోహ్లీ నినాదాలతో మార్మోగిపోతుంటుంది. టీవీలల్లో, మొబైల్స్ల్లో మ్యాచ్ వ్యూయర్షిప్ కూడా పెరిగిపోతుంటుంది. అయితే తమ అభిమాన క్రికెటర్ను జీవితంలో కనీసం ఒకసారైనా కలవాలని చాలా మంది ఆశపడుతుంటారు. అందుకు చాలా ప్రయత్నాలే చేస్తుంటారు. కానీ అందరికీ ఆ అవకాశం దక్కదు. కానీ కోహ్లీని ఎలాగైనా కలవాలనే ఉద్దేశంతో లక్నోకు చెందిన ఓ అభిమాని ముంబైకి బయలుదేరాడు. అది కూడా నడుచుకుంటూ కావడం గమనార్హం. విరాట్ కోహ్లీని కలవడానికి కాలినడకన లక్నో నుంచి ముంబై వెళ్తున్న ఆ అభిమాని పేరు వినయ్ అని పలువురు చెబుతున్నారు. టీమిండియా జెర్సీ ధరించి, విరాట్ కోహ్లీ ఫోటోతో వెళ్తున్న వినయ్ను చూసి పలువురు వీడియా తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇలాంటి మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 20 , 2024 | 02:12 PM