ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

India vs England: ఇండియా vs ఇంగ్లండ్.. వర్షం పడి మ్యాచ్ రద్దయితే?

ABN, Publish Date - Jun 26 , 2024 | 08:54 PM

టీ20 వరల్డ్‌కప్ టోర్నమెంట్ ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. గ్రూప్ దశ, సూపర్-8 ముగించుకొని.. సెమీ ఫైనల్స్‌కు వచ్చేసింది. భారత కాలమానం ప్రకారం.. జూన్ 27వ తేదీన ఉదయం 06:00 గంటలకు..

India vs England

టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) టోర్నమెంట్ ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. గ్రూప్ దశ, సూపర్-8 ముగించుకొని.. సెమీ ఫైనల్స్‌కు వచ్చేసింది. భారత కాలమానం ప్రకారం.. జూన్ 27వ తేదీన ఉదయం 06:00 గంటలకు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ (South Africa vs Afghanistan) మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా, ఆ తర్వాత రాత్రి 08:00 గంటలకు భారత్, ఇంగ్లండ్ (India vs England) జట్లు తలపడనున్నాయి. అయితే.. క్రీడాభిమానుల దృష్టి రెండో మ్యాచ్ మీదే ఉంది. ఇరుజట్ల బలాబలాలు సమం కావడంతో.. ఎవరు నెగ్గుతారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఇదే సమయంలో.. ఇంగ్లండ్, భారత్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు వరుణుడి ముప్పు కూడా పొంచి ఉంది. వెదర్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ మ్యాచ్‌కి ఆతిథ్యమివ్వనున్న గయానాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం 88% ఉంది. 18% పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. దీంతో.. ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే.. ఐసీసీ మాత్రం ఈ మ్యాచ్ రద్దు అవ్వకుండా ఉండేలా కొన్ని నిబంధనలను రూపొందించింది. రిజర్వ్ డేని షెడ్యూల్ చేయలేదు కానీ.. 250 నిమిషాల అదనపు సమయం కేటాయించింది. కాబట్టి.. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైనా చింతించాల్సిన అవసరం లేదు.


అప్పటికీ నిరంతర వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే మాత్రం.. ఇంగ్లండ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించి, భారత జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం.. వర్షం కారణంగా సెమీ ఫైనల్ మ్యాచ్ రద్దయితే, అప్పుడు గ్రూప్ దశలో అగ్రస్థానంలో ఉన్న జట్లు ఫైనల్స్‌కు దూసుకెళ్తాయి. సూపర్-8లో భాగంగా గ్రూప్-1లో భారత జట్టు ఒక్క ఓటమి కూడా చవిచూడకుండా మూడు విజయాలు సాధించి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. దీంతో.. ఐసీసీ నిబంధనల ప్రకారం టీమిండియా నేరుగా ఫైనల్స్‌కి వెళ్తుంది. కాబట్టి.. వర్షం దెబ్బకు మ్యాచ్ రద్దయినా.. భారత క్రీడాభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 26 , 2024 | 08:54 PM

Advertising
Advertising