ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో నిశాంత్ ఓటమి..స్కోరింగ్ తప్పు అంశంపై ప్రస్తావించిన మాజీ ఒలింపిక్ విజేత

ABN, Publish Date - Aug 04 , 2024 | 09:20 PM

పారిస్‌ ఒలింపిక్స్‌(Paris Olympics 2024)లో యువకుడు నిశాంత్‌ దేవ్‌ నుంచి భారత్‌ బాక్సింగ్‌లో పతకం ఆశించింది. ఆ క్రమంలోనే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అతను అద్భుతంగా ఆడాడు. కానీ పారిస్ ఒలంపిక్స్‌లో మాత్రం స్కోరింగ్ విధానం తప్పుగా ఉందని పలువురు అంటున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Nishant dev defeat

పారిస్‌ ఒలింపిక్స్‌(Paris Olympics 2024)లో యువకుడు నిశాంత్‌ దేవ్‌ నుంచి భారత్‌ బాక్సింగ్‌లో పతకం ఆశించింది. ఆ క్రమంలోనే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అతను అద్భుతంగా ఆడాడు. మొదటి రెండు రౌండ్లలో ఆధిక్యం సాధించిన తర్వాత కూడా అతను నిష్క్రమించాల్సి వచ్చింది. బాక్సింగ్‌లో ఒకరిపై ఒకరు పంచ్‌లు విసరడం ద్వారా విజేతను నిర్ణయిస్తారు. కానీ పారిస్ ఒలంపిక్స్‌లో మాత్రం స్కోరింగ్ విధానం తప్పుగా ఉందని పలువురు అంటున్నారు. దీనికి తాజా ఉదాహరణ పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆటగాడు నిషాంత్ దేవ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అని చెబుతున్నారు. 71 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో నిశాంత్ మెక్సికోకు చెందిన మార్కో వెర్డే అల్వారెజ్ చేతిలో రెండు రౌండ్లలో ఆధిక్యంతో ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.


తొలి రౌండ్‌లో

ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 4-1తో విజయం సాధించి పారిస్ ఒలింపిక్స్‌లో మెక్సికన్ బాక్సర్ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. అయితే ఈ ఛాంపియన్‌షిప్‌లో నిశాంత్ దేవ్ తొలి రౌండ్‌లో విజయం సాధించాడు. రెండో రౌండ్‌లో కూడా బౌట్‌పై అతని పూర్తి నియంత్రణ కనిపించింది. ఆ క్రమంలో మెక్సికన్ బాక్సర్‌పై అనేక శక్తివంతమైన జబ్ హుక్స్‌ను వేశాడు. అయినప్పటికీ న్యాయనిర్ణేతలు ఆశ్చర్యకరంగా ఆ రౌండ్‌లో అల్వారెజ్‌కి అనుకూలంగా తీర్పునిచ్చారు. ఈ అంశం ప్రస్తుతం వివాదంగా మారింది.


కామెంట్లు

నిశాంత్ ఓటమి తరువాత అనేక మంది సోషల్ మీడియాలో న్యాయమూర్తుల పక్షపాత వైఖరిపై కామెంట్లు చేస్తున్నారు. బీజింగ్ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన బాక్సర్ విజేందర్ సింగ్ కూడా ఈ అంశంపై స్పందించారు. స్కోరింగ్ విధానం ఏమిటో నాకు తెలియదు కానీ, ఇది చాలా దగ్గరి మ్యాచ్. నిశాంత్ బాగా ఆడాడని పేర్కొన్నాడు. మరోవైపు MC మేరీ కోమ్ కూడా ఈ అంశంపై స్పందించారు. చెత్త విషయం ఏమిటంటే దీనిపై ఎవరూ సమీక్ష చేయలేదు. లేదా నిరసనలు తెలుపలేదు. ప్రపంచం దానిని చూసి ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని అభిప్రాయం వ్యక్తం చేసింది.


చాలా రిగ్గింగ్‌

ఇది చీటింగ్ అని నిశాంత్ దేవ్ స్పష్టమైన విజేత అని మరో వ్యక్తి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. బాక్సింగ్ ఆటలో చాలా రిగ్గింగ్‌ జరిగిందన్నారు. న్యాయనిర్ణేతలు ఎలా స్కోర్ చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు, పారదర్శకత లేదన్నారు. ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ గేమ్ విషయంలో క్రీడా వర్గాలు స్పందించి నిర్ణయం మారుస్తారా లేదా అనేది చూడాలి.


Also Read:

Sri Lanka vs India, 2nd ODI: ముగిసిన శ్రీలంక బ్యాటింగ్.. భారత లక్ష్యం ఎంతంటే?

Paris Olympics 2024: ఇలాగైతే కష్టమే.. వివాదాలమయంగా ప్యారిస్ ఒలింపిక్స్..!


For More Sports News and Telugu News..

Updated Date - Aug 04 , 2024 | 09:22 PM

Advertising
Advertising
<