Sindhu : సెమీస్కు సింధు
ABN , Publish Date - May 25 , 2024 | 05:33 AM
స్టార్ షట్లర్ పీవీ సింధు మలేసియా మాస్టర్స్ టోర్నమెంట్లో సెమీఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో సింధు 21-13, 14-21, 21-12తో టాప్సీడ్ హాన్ యుయి (చైనా)ను ఓడించింది. కాగా, సింధుకిది కెరీర్లో 452వ

అత్యధిక విజయాలతో సైనా రికార్డు బ్రేక్
న్యూఢిల్లీ: స్టార్ షట్లర్ పీవీ సింధు మలేసియా మాస్టర్స్ టోర్నమెంట్లో సెమీఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో సింధు 21-13, 14-21, 21-12తో టాప్సీడ్ హాన్ యుయి (చైనా)ను ఓడించింది. కాగా, సింధుకిది కెరీర్లో 452వ విజయం కావడం విశేషం. ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సింగిల్స్లో అత్యధిక విజయాలు సాధించిన షట్లర్గా సైనా నెహ్వాల్ (451) రికార్డును సింధు అధిగమించింది. ఫైనల్లో చోటుకోసం బుసానన్ (థాయ్లాండ్)తో సింధు తలపడనుంది. మరో భారత షట్లర్ అస్మిత 10-21, 15-21తో ఝాంగ్ యి (చైనా) చేతిలో ఓడింది.