ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: ఆరు నెలల్లోగా పార్టీ ఫిరాంపులపై చర్యలు తీసుకోవాలి

ABN, Publish Date - Jul 16 , 2024 | 01:49 PM

పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తదితరులు స్పీకర్‌ను కలిశారు.

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తదితరులు స్పీకర్‌ను కలిశారు. స్పీకర్‌కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మా పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారారని తెలిపారు. స్పీకర్ ఆరు మాసాల్లోపు పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. మణిపూర్‌లో ఓ ఎమ్మేల్యేను అలాగే డిస్ క్వాలిఫై చేశారని తెలిపారు. అనర్హతపై నిర్ణయాధికారం స్పీకర్‌కే ఉన్నప్పటికీ మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పిందని కేటీఆర్ అన్నారు.


చేతిలో రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ ఫోజులు కొడుతూ.. బయట ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరితే అక్కడ ఫిరాయింపులపై కాంగ్రెస్ పోరాడుతోందని అన్నారు. గోవాలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పార్టీ మారబోమని ప్రమాణం చేయించారన్నారు. పార్టీ ఫిరాయింపులు అనైతికమని స్పీకర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారన్నారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. స్పీకర్ ఆ పది మందిపై అనర్హత వేటు వేస్తారని నమ్మకం ఉందన్నారు. కడియం శ్రీహరి ముందు నుంచే కోవర్ట్‌గా ఉన్నారని అనుమానం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

Drugs Case: డ్రగ్స్ కేసులో ఏ6గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు

YSRCP: గుడివాడలోని వైసీపీ కార్యాలయం ఖాళీ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 16 , 2024 | 01:49 PM

Advertising
Advertising
<