మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG: నల్లగొండ మాజీ ఎంపీ దామోదర్‌రెడ్డి మృతి

ABN, Publish Date - May 14 , 2024 | 04:02 AM

నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, నల్లగొండ మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్‌రెడ్డి(85) మృతి చెందారు. ఏడాదిగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్‌ సంతో్‌షనగర్‌లోని స్వగృహంలో సోమవారం మధ్యాహ్నం చనిపోయారు.

TG: నల్లగొండ మాజీ ఎంపీ దామోదర్‌రెడ్డి మృతి

  • అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూత

  • మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి సంతాపం

దేవరకొండ, మే 13:నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, నల్లగొండ మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్‌రెడ్డి(85) మృతి చెందారు. ఏడాదిగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్‌ సంతో్‌షనగర్‌లోని స్వగృహంలో సోమవారం మధ్యాహ్నం చనిపోయారు.నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన దామోదర్‌రెడ్డి 1979లో నల్లగొండ ఎంపీ గా గెలుపొందారు.


దేవరకొండ ప్రాంతంలోని సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేశారు. మాజీ సీఎంలు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కొణిజేటి రోశయ్య, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, చకిలం శ్రీనివాసరావులకు ఆయన సన్నిహితుడు. హైదరాబాద్‌ ప్రశాసన్‌నగర్‌లోని మహాప్రస్థానంలో మంగళవారం దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. దామోదర్‌రెడ్డి మృతి పట్ల మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి, ఎమ్మెల్యే బాలునాయక్‌ తదితరులు సంతాపం తెలిపారు

Updated Date - May 14 , 2024 | 04:02 AM

Advertising
Advertising