Share News

CS Shantikumari :ఆరుగురుకి డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతి

ABN , Publish Date - Jun 15 , 2024 | 06:24 AM

రాష్ట్ర సచివాలయంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఆరుగురు సహాయ కార్యదర్శులకు ప్రభుత్వం డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం జీవోను జారీ చేశారు.

CS Shantikumari :ఆరుగురుకి డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతి

హైదరాబాద్‌, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఆరుగురు సహాయ కార్యదర్శులకు ప్రభుత్వం డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం జీవోను జారీ చేశారు. పదోన్నతులు పొందిన ఈ ఆరుగురికి పోస్టింగులు ఇచ్చారు. వారిలో ఆర్‌.శోభన్‌బాబుకు పురపాలక, పట్టణాభివృద్ధి, ఇ.రాజేంద్రప్రసాద్‌కు విద్య, ఎస్‌.లక్ష్మీబాయికి గిరిజన సంక్షేమం, ఎస్‌.సత్యనారాయణకు మహిళా శిశు సంక్షేమ, ఎ.కల్యాణికి పురపాలక, పట్టణాభివృద్ధి, ఆర్‌.శ్రీనివా్‌సకు రవాణా, రోడ్లు-భవనాల శాఖలలో డిప్యూటీ సెక్రటరీలుగా వెళ్లనున్నారు. వీరంతా 15 రోజుల్లోగా తమ పోస్టుల్లో చేరాలని ఆదేశించారు. ఒకవేళ 15 రోజుల్లో చేరకపోతే... వారి నియామకం, పదోన్నతి రద్దవుతుందని హెచ్చరించారు.

Updated Date - Jun 15 , 2024 | 07:03 AM