ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jogipet: జోగిపేట పోలీస్ స్టేషన్‌ ముందే భారీ చోరీ..

ABN, Publish Date - Aug 13 , 2024 | 04:27 AM

పట్టపగలే.. అదీ పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే భారీ చోరీ జరిగింది.ఆపి ఉన్న కారు అద్దాలు పగులకొట్టి దొంగలు ఏకంగా రూ.10 లక్షలు ఎత్తుకెళ్లారు.

  • కారు అద్దాలు పగులకొట్టి రూ.10 లక్షల అపహరణ

జోగిపేట, ఆగస్టు 12: పట్టపగలే.. అదీ పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే భారీ చోరీ జరిగింది.ఆపి ఉన్న కారు అద్దాలు పగులకొట్టి దొంగలు ఏకంగా రూ.10 లక్షలు ఎత్తుకెళ్లారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. వాసవీనగర్‌ కాలనీలో నివాసముండే రవీందర్‌రెడ్డి ట్రాన్స్‌కోలో డిప్యూటీ ఏఈగా పనిచేసి రిటైరయ్యారు. ఆయన తన కుమారుడు సాయికిరణ్‌తో కలిసి మధ్యాహ్నం పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంకులో రూ.10 లక్షలు డ్రా చేసుకుని కారులో ఇంటికి బయలుదేరారు.


ఈ క్రమంలో స్థానిక పోలీ్‌సస్టేషన్‌ ఎదుట కారు ఆపి.. స్వీట్‌ షాప్‌లోకి వెళ్లారు. ఇదే అదునుగా గుర్తుతెలియని దొంగలు.. కారు అద్దాలు పగులగొట్టి రూ.10లక్షలు అపహరించి పారిపోయారు. కారు వద్దకు వచ్చిన రవీందర్‌రెడ్డి.. విషయాన్ని గమనించి వెంటనే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - Aug 13 , 2024 | 04:27 AM

Advertising
Advertising
<