ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG: గ్రామ పంచాయతీలను నడిపేదెట్లా?

ABN, Publish Date - May 13 , 2024 | 05:25 AM

: గ్రామపంచాయతీలు నిధుల సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా చిన్న గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలించేందుకు ట్రాక్టర్లలో డీజిల్‌ పోయడానికి కూడా డబ్లుల్లేని దుస్థితి. పంచాయతీ భవనాల కరెంటు బిల్లులు కట్టడానికి కూడా నిధుల్లేవని పంచాయతీల ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • నిధుల్లేక పంచాయతీల్లో పేరుకుపోతున్న సమస్యలు

  • ఆందోళనలో పంచాయతీల ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు

హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీలు నిధుల సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా చిన్న గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలించేందుకు ట్రాక్టర్లలో డీజిల్‌ పోయడానికి కూడా డబ్లుల్లేని దుస్థితి. పంచాయతీ భవనాల కరెంటు బిల్లులు కట్టడానికి కూడా నిధుల్లేవని పంచాయతీల ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒత్తిడికి లోనవుతున్నారు. రెండేళ్లుగా రాష్ట్ర ఆర్థిక సంఘం(ఎ్‌సఎ్‌ఫసీ) నిధులను సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో గ్రామ పంచాయతీల్లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఎస్‌ఎ్‌ఫసీ కింద ప్రతి నెలా రూ.230 కోట్లకు పైగా విడుదల చేయాల్సి ఉంటుంది. 2022 ఆగస్టు వరకు పంచాయతీల ఖాతాల్లో నిధులు జమచేసిన రాష్ట్ర సర్కారు.. ఆ తర్వాత పెండింగ్‌ పెడుతూ వస్తోంది. దీంతో, మొత్తంగా గ్రామపంచాయతీలకు ఎస్‌ఎ్‌ఫసీ నిధులు రూ.4,600 కోట్లు రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు రావాల్సిన నిధులు రాకపోవడం, ఇతర ఆదాయ వనరుల్లేక పోవడంతో గ్రామాల్లో కనీస సమస్యలను కూడా పరిష్కరించే పరిస్థితి లేకుండా పోయిందని సంబంధిత విభాగాలు చెబుతున్నాయి.


పాలకవర్గాల ఎన్నిక తర్వాతే నిధులు

పంచాయతీలకు సక్రమంగా నిధులు విడుదల చేయకపోయినా పాలకవర్గాలు ఉన్నపుడు సర్పంచులు ఏదో విధంగా డబ్బులు సర్దుబాటుచేసి పనులు ఆగకుండా చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సర్పంచుల పదవీకాలం పూర్తికావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుంచి పంచాయతీల్లో ప్రత్యేక పాలన ప్రారభమైంది. కొన్ని చోట్ల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు పనులు నిలిచిపోకుండా ఉండేందుకు డబ్బులు సర్దుబాటు చేసినప్పటికీ.. నెలల తరబడి పంచాయతీలను ఎలా నిర్వహించాలన్న దానిపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా ప్రత్యేక అధికారుల పాలనలో రావని, మళ్లీ పంచాయతీల పాలకవర్గాలను ఎన్నుకొన్న తర్వాతే కేంద్రం నిధులు వస్తాయని పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. గతంలో ఎస్‌ఎ్‌ఫసీ నిధులు రాకున్నా.. కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా పాలకవర్గాలు గ్రామ పంచాయతీలను నెట్టుకువచ్చాయి. ఇప్పుడు రాష్ట్రం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవీ రాకపోవడంతో ఆదాయ వనరుల్లేని గ్రామాల పరిస్థితి దయనీయంగా మారింది.


వేతనాల కోసం కార్మికుల ఒత్తిడి

గ్రామ పంచాయతీల్లో నిధుల్లేక చాలా చోట్ల సిబ్బందికి వేతనాలు చెల్లించడం లేదు. ఫలితంగా కార్మికులు పనులు చేయడం లేదు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో ప్రతి 500 మంది జనాభాకు ఒక మల్టీపర్పస్‌ కార్మికుడిని నియమించే అవకాశం కల్పించింది. వీరు విద్యుత్‌ లైట్లు, పారిశుద్ధ్యం, మురుగు కాల్వల్లో పూడిక తొలగింపు, చెత్త ట్రాక్టర్‌ నడిపించడం, మంచినీటి సరఫరా వంటి పనులు చేయాల్సి ఉంటుంది. వీరికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఇక, మేజర్‌ పంచాయతీల్లో అవసరమైనంత సంఖ్యలో పారిశుద్ధ్య సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనులు నిలిచిపోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా కూలీలను నియమించుకుంటే.. వారికి డబ్బులు చెల్లించడం కష్టంగా ఉంటోందని, ఇప్పటికే బకాయి వేతనాల కోసం కార్మికులు తమపై ఒత్తిడి తెస్తున్నారని ప్రత్యేకాధికారులు చెబుతున్నారు.

Updated Date - May 13 , 2024 | 05:25 AM

Advertising
Advertising