ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS: హైడ్రా బాధితుల వద్దకు బీఆర్ఎస్ నేతలు..

ABN, Publish Date - Sep 29 , 2024 | 09:34 AM

నిరంకుశ ఇందిరమ్మ ప్రభుత్వ విధానాలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నయిని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా విధ్వంసం సృష్టిస్తోందన్నారు. ఎక్కడ చూసినా హైడ్రా కూల్చివేతలు కనిపిస్తున్నాయని, ఇప్పటికే చాలామంది ఇళ్లు కోల్పోయారని, అటు మూసి పరివాహక ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు.

హైదరాబాద్: హైడ్రా (Htdra) బాధితుల వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs), ఎమ్మెల్సీల బృందం (MLCs Group) ఆదివారం ఉదయం బయలుదేరనుంది. ఈ క్రమంలో కోకాపేట్ నివాసం నుంచి తెలంగాణ భవన్‌కు మాజీమంత్రి హరీష్ రావు (Harish Rao) బయలు దేరారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan) నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో మూసీ రివర్ ఫ్రంట్ బాధితులను (Moose Riverfront Victims) కలిసేందుకు బండ్లగూడ, హైదర్ షా కోట్ మూసి పరివాహక ప్రాంతాలకు బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం మూసీ భాదితులను పరామర్శించనున్నారు. పార్టీ తరుపున న్యాయపరంగా బాధితుల తరుపున పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైడ్రాపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. కాగా వైరల్ ఫీవర్ కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పర్యటనకు కేటీఆర్ దూరంగా ఉన్నారు. హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటించనుంది.


నిరంకుశ ఇందిరమ్మ ప్రభుత్వ విధానాలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయిని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా విధ్వంసం సృష్టిస్తోందన్నారు. ఎక్కడ చూసినా హైడ్రా కూల్చివేతలు కనిపిస్తున్నాయని, ఇప్పటికే చాలామంది ఇళ్లు కోల్పోయారని, అటు మూసీ పరివాహక ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని, దీంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో బాధితులు ఉన్నారని అన్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్‌యే తమకు న్యాయం చేస్తారని బాధితులు నమ్ముతున్నారని, బీఆర్‌ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు.


కాగా అక్రమ నిర్మాణాల కూల్చివేతకు హైదరాబాద్ విపత్తు నిర్వహణ ఆస్తుల రక్షణ సంస్థ హైడ్రా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటి వరకు రాజకీయ, ఇతర విమర్శలతో ఆచీ తూచీ వ్యవహరిస్తున్న హైడ్రా.. బుల్డోజర్ న్యాయంపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దూకుడు పెంచాలని భావిస్తోంది. సుప్రీం ఆదేశాలు తమకు వర్తించవని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. చెరువులు, నాళాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు మాత్రమే తొలగిస్తున్నామని, వాటికి న్యాయస్థానాల్లోని మినహాయింపు ఉందని చెప్పారు.


కగా చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ లక్ష్యంగా హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) ఆపరేషన్‌ వేగం పుంజుకుంది. భారీ భవనాలను నేలమట్టం చేస్తున్న నేపథ్యంలో అధునాతన సాంకేతికతతో పనిచేసే హై రీచ్‌ జా క్రషర్‌, హై రీచ్‌ రాక్‌ బ్రేకర్‌లను వినియోగిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌పై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

72 అడుగుల డూండీ గణేష్ నిమర్జనం

గచ్చిబౌలి స్టేడియంలో ‘పింక్ పవర్ రన్ 2024’

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 29 , 2024 | 09:34 AM