ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS NEWS: మలక్‌పేట బంగారం షాపులో భారీ చోరీ

ABN, Publish Date - Feb 14 , 2024 | 03:51 PM

నగరంలోని మలక్‌పేట అక్బర్ బాగ్‌లోని కిశ్వా జ్యూవెలరీలో బుధవారం నాడు భారీ చోరీ జరిగింది. ఈరోజు మధ్యాహ్నం బైక్‌పై పాపు వద్దకు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వీరే షాప్‌లోకి చోరబడి బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు షాపు నిర్వాహకులు అనుమానిస్తున్నారు.

హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట అక్బర్ బాగ్‌లోని కిశ్వా జ్యూవెలరీలో బుధవారం నాడు భారీ చోరీ జరిగింది. ఈరోజు మధ్యాహ్నం బైక్‌పై పాపు వద్దకు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వీరే షాప్‌లోకి చోరబడి బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు షాపు నిర్వాహకులు అనుమానిస్తున్నారు. దుండగులను అడ్డుకోబోయిన వ్యాపారి సజావుర్ రెహమాన్‌పై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో వ్యాపారికి తీవ్ర గాయాలయ్యాయి. వ్యాపారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి ఈస్ట్ జోన్ డీసీపీ జానకి ధారవత్, క్లూస్ టీమ్ చేరుకున్నారు. దుండగులు షాపులో ఏమేమి ఎత్తుకెళ్లారనే దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆధారాల కోసం దగ్గరలోని సీసీ కెమెరాలను పోలీసులు, క్లూస్ టీం అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Feb 14 , 2024 | 04:17 PM

Advertising
Advertising