ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam: ప్రతీ ఒక్కరు బీసీ సంక్షేమ గౌరవాన్ని కాపాడాలి

ABN, Publish Date - Oct 07 , 2024 | 12:38 PM

Telangana: కింది స్థాయి నుంచి పై వరకు ఉన్న అధికారులు బీసీ సంక్షేమ శాఖ గౌరవాన్ని కాపాడాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలనలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే పాఠశాలలో 1100 కోట్లతో 25 వేల స్కూల్‌లకు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.

Minister Ponnam Prabahakar

హైదరాబాద్, అక్టోబర్ 7: నగరంలోని బంజారాహిల్స్ కొమురంభీమ్ భవన్‌లో తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విసృత స్థాయి అధికారుల సమీక్షా సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గురుకులాల పరిస్థితి పై ఆరా తీశారు. క్షేత్ర స్థాయిలో హాస్టల్స్, గురుకులాలు ఎదుర్కుంటున్న సమస్యలపై మంత్రి అడిగి తెలుసుకున్నారు.

Congress Vs BRS: గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంప్ కార్యాలయం ముట్టడి


అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కింది స్థాయి నుంచి పై వరకు ఉన్న అధికారులు బీసీ సంక్షేమ శాఖ గౌరవాన్ని కాపాడాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలనలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే పాఠశాలలో 1100 కోట్లతో 25 వేల స్కూల్‌లకు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. గత 10 సంవత్సరాలుగా బదిలీలు, ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయ లోకానికి 19 వేల ప్రమోషన్లు ,35 వేల బదిలీలు చేపట్టామని తెలిపారు. ప్రతి స్కూల్‌కు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని.. డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. శానిటేషన్‌కు ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు.


గత దశాబ్ద కాలంగా నిరుత్సాహంలో ఉన్న మోడల్ స్కూల్ టీచర్లకు కూడా బదిలీలు చేపట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్కూల్‌లో 9 వేల నియామకాలు చేపట్టామని.. కొత్తగా నియామకాలు అయిన వారిని కూడా ఎలాంటి పైరో లేకుండా బదిలీలకు అవకాశం ఇవ్వడం లేదని వెల్లడించారు. నిన్ననే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ భవనాల నమూనా విడుదల చేశారన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉన్న మాదిరి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ నెల 11న శంఖుస్థాపన చేసుకుంటున్నామని.. ఈ సంవత్సరానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ భవనాలకు రూ.5 వేల కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. గురుకుల పాఠశాలలకు రావడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారన్నారు. గురుకులల్లో స్పోర్ట్స్ , కల్చరల్ యాక్టివిటీస్ పెంచాలని సూచించారు. అధికారుల పనితీరు మెరుగుపడాలన్నారు.

Tirumala Free Darshan: తిరుమల వెళ్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకుంటే.. మీ దర్శనం చాలా ఈజీ..



రాష్ట్రంలో గురుకులాల్లో 98 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైందన్నారు. 326 గురుకుల పాఠశాలలో 21 మాత్రమే సొంత భవనాలు ఉన్నాయన్నారు. మిగిలినవి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని చెప్పారు. దసరాలోపు వాటి 50 శాతం అద్దెలు చెల్లిస్తామని.. వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించేలా యాజమానులతో మాట్లాడాలని అధికారులకు సూచించారు. గురుకులాల్లో చెత్త, గడ్డి లేకుండా ఉండడానికి ఉపాధి హామీ ద్వారా శుభ్రపరచాలని కలెక్టర్‌లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ‘‘క్షేత్ర స్థాయిలో మీరు ఎదుర్కుంటున్న సమస్యలు మా దృష్టికి తీసుకురావాలి. అధ్యాపకులు నిరంతరం శ్రనిస్తున్నారన్న పేరు తెచ్చుకోవాలి.. ఈనెల 9 వ తేదిన డీఎస్సీ ద్వారా ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.


ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, కమిషనర్ బాల మాయాదేవి, గురుకుల సెక్రటరీ సైదులు, ఎంబీసీ కార్పోరేషన్ ఎండీ అలోక్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు, అడిషనల్ డెరైక్టర్ చంద్ర శేఖర్, జాయింట్ డైరెక్టర్ సంధ్య, నాయి బ్రాహ్మణ ఎండీ ఇందిరా ,బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి , డిబిసిడివొస్, ఏడిబిసిడివొస్, ఆర్సివోస్, డిసివోస్, ప్రిన్సిపల్స్ , హాస్టల్ వార్డెన్లు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

Bathukamma: ఆరోరోజు అలిగిన బతుకమ్మ... ఎందుకు అలిగిందో తెలుసా

Congress Vs BRS: గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంప్ కార్యాలయం ముట్టడి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2024 | 12:50 PM