ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: ఎన్నో కలలతో అత్తగారింట అడుగుపెట్టిన ఆ వధువు నెల తిరిగేసరికి...

ABN, Publish Date - Aug 24 , 2024 | 12:46 PM

Telangana: హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో నవ వధువు ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రిక్షా పుల్లర్ కాలనీలో మనీషా(27) అనే నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. నెల క్రితమే మనీషా ప్రేమ వివాహం చేసుకుంది. మనీషను శేఖర్ అనే వ్యక్తి ప్రేమించి, పెద్దల అనుమతితో జులై 10న ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నాడు. శేఖర్ అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.

Hyderabad

హైదరాబాద్, ఆగస్టు 24: ఆ యువతికి వివాహం జరిగి నెలరోజులు మాత్రమే అయ్యింది. ఎంతో సంతోషంతో అత్తగారింట్లో అడుగుపెట్టి ఆమె ఆశలు అడియాశలే అయ్యాయి. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నాను అన్న సంతోషం ఎక్కువ రోజులు నిలవకుండా పోయింది. ప్రేమించిన వాడే భర్తగా మారడంతో జీవితాంతం సంతోషాలతో ఉంటానని భావించిన ఆ నవవధువుకు తీవ్ర నిరాశే అయ్యింది. కట్నపిశాచికి ఆమె బలిఅయిపోయింది. అంతే కాకుండా తన ఇష్టసఖుడికి మరొకరితో అక్రమ సంబంధం ఉందని తెలిసిస ఆ యువతి తట్టుకోలేకపోయింది. భర్తను విడిచి పుట్టింటి వెళ్లలేక.. ఇక బతకలేను అని భావించిన ఆమె చివరకు ప్రాణాలు తీసుకోడానికి కూడా వెనకాడలేదు. 27 ఏళ్లకే నిండునూరేళ్ల జీవితాన్ని ముగించేసింది.

Pallasrinivas: అచ్యుతాపురం ఘటనపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ నేత


హైదరాబాద్‌లోని (Hyderabad) జగద్గిరిగుట్టలో నవ వధువు ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రిక్షా పుల్లర్ కాలనీలో మనీషా(27) అనే నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. నెల క్రితమే మనీషా ప్రేమ వివాహం చేసుకుంది. మనీషను శేఖర్ అనే వ్యక్తి ప్రేమించి, పెద్దల అనుమతితో జులై 10న ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నాడు. శేఖర్ అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అయితే పెళ్లికి ముందే మరో యువతితో భర్త శేఖర్‌కు సంబంధం ఉన్నట్లు మనీషాకు తెలిసిందే.

Janwada Farm House: నెక్స్ట్ జన్వాడ ఫామ్ హౌసేనా? |


అదనపు కట్నం తేవాలంటూ అత్తగారింట్లో ఆరళ్లు కూడా రోజురోజుకు ఎక్కువైపోయాయి. వీటన్నింటితో విసిగిపోయిన మనీషా ఈనెల 11న యాసిడ్ తాగేసింది. తీవ్ర అపస్మారకస్థితిలోకి వెళ్లిన మనీషాను కూకట్‌పల్లిలోని ఆస్పత్రికి తరలించారు. అయితే గత పదమూడు రోజులుగా మృత్యువుతో పోరాడిన మనీషా ఈరోజు ఉదయం మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

TG News: వీసా కన్సల్టెన్సీ యజమాని కిడ్నాప్.. రక్షించిన పోలీసులు

Hyderabad: ఫెమినా మిస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌గా భవ్యారెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 24 , 2024 | 01:16 PM

Advertising
Advertising
<