Mallareddy: ఇలా అవుతుందని కలలో కూడా ఊహించలేదు..
ABN, Publish Date - Feb 03 , 2024 | 03:42 PM
Telangana: తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోతుందని కలలో కూడా ఊహించలేదని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గాలికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గాలిలోనే కలిసిపోతుందని వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్, ఫిబ్రవరి 3: తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) ఓడిపోతుందని కలలో కూడా ఊహించలేదని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (MLA Mallareddy) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గాలికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) గాలిలోనే కలిసిపోతుందని వ్యాఖ్యలు చేశారు. పద్దెనిమిదేళ్ళ పాటు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. తాగునీరు, సాగునీరు అందించి, దేశానికి అన్నం పెట్టే రైతన్నను తయారు చేసిన నాయకుడు కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. 56 ఏళ్ళ పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని ఎమ్మెల్యే మల్లారెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 03 , 2024 | 04:48 PM