ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Suryapet: చిన్నారిని కొరికి, నేలకేసి కొట్టి..

ABN, Publish Date - Jun 13 , 2024 | 03:00 AM

ఆ బిడ్డకు నిండా రెండేళ్లు కూడా లేవు! హాయిగా నిద్రపోతోంది. ఆమె తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి, ఆ చిన్నారిని ఇష్టమొచ్చినట్లు కొరికి.. నేలకోసి కొట్టి చంపాడు. వివాహేతర సంబంధానికి ఆ బిడ్డ అడ్డొస్తోందనే ఉన్మాదంతో అతడు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు.

  • వివాహేతర బంధానికి అడ్డొస్తోందని ప్రియురాలి కూతురిని చంపిన వ్యక్తి

  • సూర్యాపేట జిల్లా చివ్వెంలలో ఘటన

చివ్వెంల, జూన్‌ 12: ఆ బిడ్డకు నిండా రెండేళ్లు కూడా లేవు! హాయిగా నిద్రపోతోంది. ఆమె తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి, ఆ చిన్నారిని ఇష్టమొచ్చినట్లు కొరికి.. నేలకోసి కొట్టి చంపాడు. వివాహేతర సంబంధానికి ఆ బిడ్డ అడ్డొస్తోందనే ఉన్మాదంతో అతడు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం... నిజామాబాద్‌ జిల్లాలోని రెంజల్‌ మండల పరిధిలోని సాటాపూర్‌కు చెందిన మోత్కా విజయ, సాయిలు దంపతుల కుమార్తె రమ్య అలియాస్‌ నవ్యశ్రీకి అదే మండలంలోని గుండారానికి చెందిన కటకట లక్ష్మణ్‌తో ఐదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి కుమార్తెలు ఆరుణ్య (4), మహాన్వి (22నెలలు) ఉన్నారు. అదే మండలంలోని తన అత్తగారి ఊరైన గుండారం గ్రామానికి చెందిన బొల్లంక అరవిందరెడ్డితో నవ్యశ్రీకి ఏడు నెలల క్రితం వివాహేతర సంబంధం కొనసాగుతోంది. నవ్యశ్రీని పెళ్లి చేసుకుంటానని, ఇద్దరు కుమార్తెల బాధ్యతను తానే చూసుకుంటానని నవ్యశ్రీని అరవిందరెడ్డి నమ్మించారు.


ఆమెను, ఇద్దరు పిల్లలను తీసుకొని 20 రోజుల క్రితం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని ఐలాపురం గ్రామానికి తీసుకువచ్చి ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఈ నెల 11న మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో మహాన్వి నిద్రిస్తుండగా, తల్లి నవ్యశ్రీ పెద్ద కుమార్తె ఆరుణ్యను తీసుకొని కిరాణ దుకాణం వద్ద సరుకులు తీసుకురావడానికి వెళ్లింది. ఈ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న మహన్విని అరవిందరెడ్డి పలుచోట్ల కొరికి, నేలకేసి కొట్టాడు. ఈ ఘటనలో ఆమె మృతిచెందగానే అరవిందరెడ్డి అక్కడి నుంచి పరారయ్యాడు. షాపు నుంచి ఇంటికొచ్చిన నవ్యశ్రీకి చిన్న కుమార్తె విగతజీవిగా పడి ఉండటంతో సటాపుపూర్‌లోని తన మేనత్త కటికల నాగమణికి చెప్పింది. బుధవారం ఉదయం నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించారు. మహన్వి కుడివైపు నుదిటిపై, చెంపలు, చేతులపై, భుజాలపై, పిరుదులపై గాయాలను కనుకొన్నారు. నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Jun 13 , 2024 | 03:00 AM

Advertising
Advertising