ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nagarjuna: ఒక్క సెంటు కూడా ఆక్రమించలేదు..

ABN, Publish Date - Aug 26 , 2024 | 03:27 AM

ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు సంబంధించిన వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే అధికంగా ఉన్నాయని సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు.

  • సినీ నటుడు అక్కినేని నాగార్జున

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు సంబంధించిన వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే అధికంగా ఉన్నాయని సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. తాము ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించిన భూమి పట్టా భూమి అని, ఒక్క సెంటు కూడా ఆక్రమించింది కాదని పేర్కొంటూ ఎక్స్‌లో ఆదివారం ఓ పోస్టు పెట్టారు.


తమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ (ప్రొహిబిషన్‌) యాక్ట్‌ ప్రత్యేక న్యాయస్థానం 2014 ఫిబ్రవరి 24న తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణం, చట్టబద్ధతపై హైకోర్టును ఆశ్రయించానని, న్యాయస్థానం ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటానని తెలిపారు. అప్పటిదాకా ఊహాగానాలు, పుకార్లను నమ్మవద్దని అభిమానులను, శ్రేయోభిలాషులను ఆయన కోరారు.

Updated Date - Aug 26 , 2024 | 03:27 AM

Advertising
Advertising
<