ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nalgonda: తల్లితో బాబాయి అక్రమ సంబంధం.. పిల్లలు ఏం చేశారంటే..

ABN, Publish Date - Aug 30 , 2024 | 09:32 PM

జిల్లాలోని మిర్యాలగూడ మండలం ఐలాపురంలో దారుణం వెలుగు చూసింది. తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాబాయిని హత్య చేశారు అక్క, తమ్ముడు. హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఖననం చేశారు.

Nalgonda News

నల్లగొండ, ఆగష్టు 30: జిల్లాలోని మిర్యాలగూడ మండలం ఐలాపురంలో దారుణం వెలుగు చూసింది. తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాబాయిని హత్య చేశారు అక్క, తమ్ముడు. హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, మృతుడి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో అసలు నిజం బయటపడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రాజశేఖర్ రాజు మీడియాకు వెళ్లడించారు.


ఐలాపురానికి చెందిన జాను అనే వ్యక్తి తన వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె పిల్లలు ఆగ్రహంతో రగిలిపోయారు. అక్క, తమ్ముడు ఇద్దరూ కలిసి తమ బాబాయిని దారుణంగా హత్య చేశారు. అనంతరం తాము చేసిన నేరం బయటపడుకుండా ఉండేందుకు మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, జాను తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల అనుమానంతో మహిళ పిల్లలిద్దరినీ విచారించగా.. అసలు నిజం అంగీకరించారు. జానును తాము చంపినట్లు ఒప్పుకున్నారు.


ఇద్దరు నిందితులను తెలిపిన వివరాల ప్రకారం ఖననం చేసిన మృతదేహాన్ని వెలికి తీశారు. తహసీల్దార్ పర్యవేక్షణలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం నిందితులిద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. అక్రమ సంబంధం ఒక వ్యక్తిని బలితీసుకోగా.. అక్కా, తమ్ముడిని జైలుపాలు చేసింది.


Also Read:

సీఎం రేవంత్ తప్పుల చిట్టా రాస్తున్నా: ఈటల రాజేందర్

గూగుల్ పే నుంచి కొత్తగా ఆరు ఫీచర్లు.. అవేంటంటే..

కిడ్నాపర్‌‌ను వదిలిరానని బాలుడి ఏడుపు..

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 30 , 2024 | 09:32 PM

Advertising
Advertising