ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS: మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Jul 04 , 2024 | 12:39 PM

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఇటుక పెళ్ల కదిలించినా కూడా హైదరాబాద్‌లోని గాంధీభవన్ కూల్చేస్తామని హెచ్చరించారు.

హనుమకొండ: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఇటుక పెళ్ల కదిలించినా కూడా హైదరాబాద్‌లోని గాంధీభవన్ కూల్చేస్తామని హెచ్చరించారు. గాంధీభవన్ ఒక్కటే కాదని.. జిల్లా కార్యాలయనూ టచ్ చేస్తామన్నారు. బీఆర్ఎస్ కార్యాలయాలను కూల్చివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందన్నారు. పార్టీ కార్యాలయాలకు భూములు ఇవ్వాలన్న జీవో కేసీఆర్ తెచ్చింది కాదన్నారు.


హైదరాబాద్ గాంధీభవన్ కూడా మాలాగా తీసుకున్నదేనని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. జీవోలను అనుసరించే బీఆర్ఎస్ కార్యాలయాలకు అప్పటి తమ ప్రభుత్వం భూములు కేటాయించిందన్నారు. పార్టీ కార్యాలయాలను తామేమీ కమర్షియల్‌గా వాడుకోవడం లేదని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. వరంగల్ కాంగ్రెస్ కార్యాలయంలో కొంతభాగం యూనియన్ బ్యాంక్ కు కిరాయికిచ్చారన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయాన్ని ఏకంగా ఫంక్షన్ హాల్‌గా మార్చేశారని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.

Updated Date - Jul 04 , 2024 | 12:39 PM

Advertising
Advertising