ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nalgonda: పెళ్లి పేరుతో రేప్‌.. హత్య!

ABN, Publish Date - Sep 26 , 2024 | 04:34 AM

ప్రేమ.. పెళ్లి పేరుతో యువతిని లోబర్చుకొని, గర్భవతిని చేసి మోసగించడమే కాకుండా.. చివరికి ఆ యువతి నిండు ప్రాణాల్నే బలిగొన్నాడో దుర్మార్గుడు!

  • ప్రేమ పేరుతో వంచించిన యువకుడు

  • రెండుసార్లు అబార్షన్‌ చేయించిన వైనం

  • నిలదీసిన యువతిపై బావతో కలిసి రేప్‌

  • ఆపై గొంతు నులిమి హత్య..

  • సహకరించిన యువకుడి తల్లి

  • నల్లగొండ జిల్లాలో ఘటన.. ముగ్గురి అరెస్టు

మిర్యాలగూడ అర్బన్‌, సెప్టెంబరు 25: ప్రేమ.. పెళ్లి పేరుతో యువతిని లోబర్చుకొని, గర్భవతిని చేసి మోసగించడమే కాకుండా.. చివరికి ఆ యువతి నిండు ప్రాణాల్నే బలిగొన్నాడో దుర్మార్గుడు! పెళ్లి గురించి మాట్లాడుకుందామని ఆమెను నమ్మించి సొంత బావతో కలిసి సామూహిక అత్యాచారం చేసి చంపేశాడు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డలో ఈ దారుణ ఘటన జరిగింది. డీఎస్పీ రాజశేఖర్‌రాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. పుట్టలగడ్డతండాకు చెందిన రూపావత్‌ నాగు నాయక్‌(22)కు రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో చదువుతున్న రోజుల్లో అదే మండలంలోని ఓ తండాకు చెందిన యువతి (19)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 17 ఏళ్ల వయసులో ఉన్న ఆమెను నాగు పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు.


ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. తనను పెళ్లి చేసుకోవాలని నాగును అప్పట్లోనే ఆమె నిలదీసింది. పెళ్లికి నాగు కుటుంబీకులు నిరాకరించడంతో ఆమె వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఏడాదిన్నర క్రితం నాగుపై పోక్సోచట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటినుంచి ఆమెతో తరచూ ఫోన్‌లో మాట్లాడిన నాగు.. మేజర్‌ అయ్యాక తప్పకుండా పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆమె మరోసారి అతడికి దగ్గరై మళ్లీ గర్భం దాల్చింది. రెండుసార్లూ బలవంతంగా గర్భస్రావం చేయించాడు. తర్వాత నాగు కు ఆమె ఫోన్‌ చేసి మళ్లీ పెళ్లి విషయం ప్రస్తావించింది. అయితే ఆమె నంబర్‌ను అతడు బ్లాక్‌ చేశాడు. దీంతో ఆ యువతి, తాడోపేడో తేల్చుకునేందుకు ఈ నెల 14న పుట్టలగడ్డతండాలోని ప్రియుడి ఇంటికి వెళ్లింది.


తన కొడుకుపై కేసు పెట్టిందన్న కోపంతో అప్పటికే రగిలిపోతున్న నాగుతల్లి బుజ్జి, యువతిని హత్య చేసేందుకు పథకం పన్నింది. పెళ్లి విషయం మాట్లాడుకుందామని నమ్మించి తండా శివారులోని ఓ పొలం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశానికి కుమారుడు నాగుతో, అతడికి వరుసకు బావ అయిన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం కొత్తతండాకు చెందిన రమావత్‌ క్రాంతికుమార్‌తో కలిసి యువతిని తీసుకెళ్లింది. కొద్దిసేపటికి యువతిని నాగు, క్రాంతికుమార్‌ కలిసి చెట్లపొదల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారం జరిపారు. అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు. ఇదంతా పూర్తయ్యేదాకా నాగు తల్లి బుజ్జి రోడ్డుపై కాపలాగా ఉంది. యువతి కన్పించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగు, అతడి తల్లి బుజ్జి, మరో నిందితుడు క్రాంతికుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఈ కేసులో ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - Sep 26 , 2024 | 04:34 AM