ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: ఇవాళ రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక

ABN, Publish Date - Jul 03 , 2024 | 11:42 AM

నేటి మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ రోజు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇవాళ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కేశవరావు కాంగ్రెస్‌లో చేరనున్నారు. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం నుంచే దీనికి సంబంధించిన టాక్ నడుస్తోంది. అయితే కేకే మౌనంతో వాటికి ఫుల్‌స్టాప్ పడింది.

హైదరాబాద్: నేటి మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ రోజు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇవాళ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కేశవరావు కాంగ్రెస్‌లో చేరనున్నారు. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం నుంచే దీనికి సంబంధించిన టాక్ నడుస్తోంది. అయితే కేకే మౌనంతో వాటికి ఫుల్‌స్టాప్ పడింది. తిరిగి ఇవాళ ఏకంగా కేకే పార్టీలో జాయిన్ అవుతున్న న్యూసే వచ్చింది. కర్ణాటకలో ఏ క్షణాన కాంగ్రెస్ గెలిచిందో ఒక్కసారిగా తెలంగాణలో పుంజుకోవడమే కాదు.. అధికారం దక్కించుకునే స్థితికి వెళ్లిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యాక ప్రతిపక్షాలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు.


ఏ ఆపరేషన్ ఆకర్ష్‌కు అయితే గతంలో కేసీఆర్ తెరదీసి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్‌లో విలీనం వరకూ తీసుకెళ్లారు. ఇప్పుడు అదే పరిస్థితిని రేవంత్ సైతం సృష్టించి తిరిగి బీఆర్ఎస్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలను కాపాడుకుందామని హైకమాండ్ చేస్తున్న భగీరథ ప్రయత్నాలన్నీ ఫలించలేదు. ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం పార్టీలో చేరుతూనే ఉన్నారు. దాదాపు అంతా బిచానా సర్దేస్తారని.. చివరకు కేసీఆర్ కుటుంబం మాత్రమే మిగులుతుందని అంటున్నారు. కేకే కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనుండటంతో బీఆర్ఎస్‌కు గుబులు పట్టుకుంది.

Updated Date - Jul 03 , 2024 | 11:42 AM

Advertising
Advertising