ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Road Accident: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

ABN, Publish Date - Jul 13 , 2024 | 08:52 PM

ఏటూరునాగారం(Eturnagaram) వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆటోను కంటైనర్ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతదేహాలను బయటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ములుగు: ఏటూరునాగారం(Eturnagaram) వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆటోను కంటైనర్ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతదేహాలను బయటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులు వాజేడు గ్రామానికి చెందిన కాకర్లపూడి సత్యనారాయణ రాజు, అతని భార్య సత్యవతి, కుమార్తె అనితగా పోలీసులు గుర్తించారు. ప్రాణాలు కోల్పోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. సత్యనారాయణరాజు తన కుమార్తెను విశాఖపట్నం బస్సు ఎక్కించేందుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో వారి స్వగ్రామం వాజేడులో బంధువులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

Updated Date - Jul 13 , 2024 | 08:56 PM

Advertising
Advertising
<