Home » Mulugu
మావోయిస్టు పార్టీ డీవీసీఎం పుల్సం పద్మ అలియాస్ ఊరే అలియాస్ గంగక్క సోమవారం పోలీసులకు లొంగిపోయారు. దివంగత కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ భార్య అయిన ఆమె 27 ఏళ్ల తన అజ్ఞాత జీవితాన్ని విడిచి 52 ఏళ్ల వయసులో జనజీవన స్రవంతిలో కలిశారు.
గురువారం ఉదయం సూర్యోదయానికి ముందు పూజారులు వనదేవతల మందిరాలకు చేరుకొని తల్లులకు శనివారం వరకు అంతర్గత పూజాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక మినీ జాతర ప్రారంభమైన నేపథ్యంలో మేడారానికి భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. మండమెలిగె పండుగ సందర్భంగా తల్లుల గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
ములుగు జిల్లా: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం ఉదయం ప్రారంభమైంది. వడ్డెలు సమ్మక్క-సారలమ్మ కొలువైన మేడారం, కన్నెపల్లికి ద్వారా బంధనం చేసి జాతర ప్రారంభించారు. ఈ క్రమంలో ములుగు మన్నెంలో జాతరల సందడి నెలకొంది.
ములుగు జిల్లా: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం నిర్వహించనున్నారు. మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలతో పాటు, ఛత్తీస్గఢ్ నుండి గుత్తి కోయలు, ఆదివాసీలు; జార్ఖండ్, మహారాష్ట్ర నుంచి గోండులు, కోయలు, లంబాడా; మధ్యప్రదేశ్ నుంచి బిల్లులు, రతీసాగర్ గోండులు; ఒరిస్సా నుంచి సవర ఆదివాసీలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తారు.
ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో జనవరి 23న జరిగిన ప్రజాపాలన గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన కుమ్మరి నాగేశ్వర్రావు(42) బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు.
ములుగు జిల్లా బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య మరణం ప్రభుత్వ హత్యేనని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
మంత్రి ధనసరి అనసూయ సీతక్క డీజే టిల్లు సినిమా పాటలు, తీన్మార్ మ్యూజిక్కు స్టెప్పులేశారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శనివారం ములుగు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో త్రీకే రన్ జరిగింది.
Medaram: ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు నాలుగు రోజుల పాటు జరిగే జాతర కోసం మేడారాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 40 లక్షల మందికిపైగా భక్తులు రానున్నట్లు అంచనా వేస్తున్న అధికార యంత్రాంగం.. అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 12న ఆలయ శుద్ది, పూజలు, గ్రామ నిర్బంధంతో సహా ఆచారాలు నిర్వహించనున్నారు.
TELANGANA: ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం వీరభద్రవరం అటవీ ప్రాంతంలో ఇవాళ(ఆదివారం) సాయంత్రం ప్రెషర్ బాంబ్ పేలింది. ఈ సంఘటనలో వెంకటాపురం మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల నవీన్ అనే వ్యక్తికి గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఏడాదికోసారైనా అలా ఓ హాలిడే ట్రిప్ వేసి ప్రకృతి ఒడిలో సేదతీరాలని ఎవరికి మాత్రం ఉండదు? దీనికి ఏ విదేశానికో.. బయట రాష్ట్రానికో వెళ్లనవసరం లేకుండా మన తెలంగాణలోనే గొప్ప పర్యాటక అనుభూతి పొందేందుకు గొప్ప అవకాశం!