పొన్నవోలు వ్యాఖ్యలను ఎలా సమర్ధించుకుంటారో..

ABN, Publish Date - May 31 , 2024 | 07:08 AM

విజయవాడ: న్యాయవ్యవస్థలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమయ్యాయి. ఆయన లండన్‌లో నలుగురు కనిపించగానే మాఫియా గురించి, అది ఎక్కడ పుట్టిందో అంటూ అనర్గలంగా మాట్లాడారు.

విజయవాడ: న్యాయవ్యవస్థలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమయ్యాయి. ఆయన లండన్‌లో నలుగురు కనిపించగానే మాఫియా గురించి, అది ఎక్కడ పుట్టిందో అంటూ అనర్గలంగా మాట్లాడారు. దానికి ఫ్యాక్షనిజానికి ముడిపెట్టారు. తాను ఫ్యాక్షనిస్టు ఫ్యామిలి నుంచి వచ్చానంటూనే కోస్తా ప్రాంతంలోని రాజకీయ నాయకుల గురించి నీచంగా మాట్లాడారు. ఫ్యాక్షనిస్టు నేతలు వారిని నమ్మినవారి కోసం ప్రాణాలు ఇస్తే.. కోస్తా ప్రాంతం నేతలు మాత్రం ఫోన్ హ్యాండిల్‌ను ఆఫ్ చేసి పోలీసులతో మాట్లాడుతున్నట్లు నటిస్తారని.. తానే స్వయంగా నటించి చూపించారు. అంటే కోస్తా ప్రాంత నేతలు నమ్మి వచ్చిన తమ ప్రజలను మోసం చేస్తారనే విధంగా ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు ఆ ప్రాంత నాయకుల్లోనూ చర్చకు దారితీసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌ కక్ష ఏబీవీకి ఐదేళ్ల శిక్ష

కౌంటింగ్‌లో గొడవ చేస్తే అరెస్టే

పెళ్లికి ఒప్పుకోలేదని..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 31 , 2024 | 07:08 AM