శ్రీకాళహస్తిలో వైసీపీ హైడ్రామా..

ABN, Publish Date - May 11 , 2024 | 09:52 AM

శ్రీకాళహస్తిలో వైసీపీ హైడ్రామా నడిచింది. గులకరాయి పేరుతో సరికొత్త నాటకాన్ని సృష్టించింది. ఎన్నికల్లో లబ్ది పొందడానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి గులకరాయి డ్రామాకు తెరలేపారు. బీసీనేత ఆర్ కృష్ణయ్యను గులకరాయితో కొట్టారనే సరికొత్త ప్రచారాన్ని సృష్టించారు.

శ్రీకాళహస్తిలో వైసీపీ హైడ్రామా నడిచింది. గులకరాయి పేరుతో సరికొత్త నాటకాన్ని సృష్టించింది. ఎన్నికల్లో లబ్ది పొందడానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి గులకరాయి డ్రామాకు తెరలేపారు. బీసీనేత ఆర్ కృష్ణయ్యను గులకరాయితో కొట్టారనే సరికొత్త ప్రచారాన్ని సృష్టించారు. ఇది బీసీలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఎస్టీ కాలనీలో ఇంగ్లీషు మీడియం గురించి కృష్ణయ్య మాట్లాడుతున్న సమయంలో గులకరాయి దాడి జరిగిందని మధుసూదన రెడ్డి ప్రకటించారు. రక్తం చుక్క లేకపోయినా.. గులకరాయి ఆనవాళ్లు లేకపోయినా.. ఆఘాయిత్యం జరిగిందని కృష్ణయ్య హల్ చల్ చేశారు. జగన్‌కు ఉన్న ఆదరణ చూడలేకనే ఈ గులకరాయి జరిగిందని ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ అధికారులు వైసీపీ కంట్రోల్‌లో...

వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనం..

తెలంగాణ పర్యటనకు ప్రియాంక గాంధీ

తిరుపతికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

ఆస్తుల రక్షణ కోసం కూటమికే ఓటేయండి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 11 , 2024 | 09:52 AM