AP Health Achievements: ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ భేష్
ABN, Publish Date - Apr 04 , 2025 | 07:05 AM
ఏపీలో ఎయిడ్స్ నియంత్రణ పనితీరు మెరుగుపడింది, రాష్ట్రం 7వ స్థానంలో చేరింది. న్యాకో అనుసరించి, 2004 నుండి 2,25,000 మందికి ఎయిడ్స్ పరీక్షలు చేసి, వ్యాధిని నియంత్రించేందుకు రూ.127 కోట్లు ఖర్చు చేసింది

17వ స్థానం నుంచి ఏడో స్థానానికి రాష్ట్రం
అమరావతి, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ పనితీరును బాగా మెరుగుపర్చుకుని 7వ స్థానానికి చేరుకుంది. జాతీయ ఎయుడ్స్ నియంత్రణ సంస్థ(న్యాకో) గురువారం రాష్ట్రాల పనితీరు సూచీని విడుదల చేసింది. 2024 ఏప్రిల్- డిసెంబరు మధ్య ఏపీసాక్స్ మెరుగైన పనితీరును కనబరిచి ఈ సూచీలో 7వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది వరకూ ఏపీ 17వ స్థానంలో ఉండేది. ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించడంలో ఏపీకృషిని న్యాకో అభినందించింది. 2004 నుంచి ఏపీలో దాదాపు 2,25,000మంది బాధితుల్ని గుర్తించడంతో పాటు వ్యాధి నియంత్రణకు రూ.127 కోట్లు న్యాకో ఖర్చుచేసింది. న్యాకో లక్ష్యాలకు అనుగుణంగా ఎయిడ్స్ను నియంత్రించడంలో ఏపీ మంచి పనితీరు కనబరిచినందుకు ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఎ.సిరిని, ఏపీశాక్స్ సిబ్బందిని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అభినందించారు.
ఇవి కూడా చదవండి
కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 04 , 2025 | 07:05 AM