distribution ఆలయంలో అన్నదానానికి రూ.3 లక్షల విరాళం
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:28 AM
స్థానిక సాయినగర్లోని షిర్డిసాయిబాబా ఆలయంలో అన్నదానం చేసేందుకు పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు ఎలుగోటి సత్యనారాయణప్ప రూ. మూడు లక్షలను విరాళంగా ఇచ్చారు.

ధర్మవరంరూరల్, ఏప్రిల్ 4(ఆంరఽధజ్యోతి): స్థానిక సాయినగర్లోని షిర్డిసాయిబాబా ఆలయంలో అన్నదానం చేసేందుకు పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు ఎలుగోటి సత్యనారాయణప్ప రూ. మూడు లక్షలను విరాళంగా ఇచ్చారు. శుక్రవారం ఆయన ఆలయంలో షిర్డిసాయిసేవాసమితి సభ్యులకు ఆ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఆలయసేవాసమితి సభ్యులు ఘనంగా సన్మానించారు.