AP Cabinet Meet: మరోసారి ఏపీ క్యాబినెట్ భేటీ.. ఈసారి చర్చించే అంశాలివే..
ABN , Publish Date - Apr 14 , 2025 | 06:48 PM
రాజధాని అమరావతి సహా ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం జరిగే ఏపీ క్యాబినెట్ సమావేశంలో రాజధాని, సీఆర్డీయే, నూతన అసెంబ్లీ, హైకోర్ట్ భవనాల నిర్మాణం వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి మండలి మరోసారి సమావేశం కానుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో మంత్రులు పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. రాజధాని అమరావతి సహా ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రేపు జరిగే సమావేశంలో రాజధాని, సీఆర్డీయే, నూతన అసెంబ్లీ, హైకోర్ట్ భవనాల నిర్మాణం వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
ఏపీ క్యాబినెట్.. చర్చించే అంశాలివే..
సీఆర్డీయే 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలన్నింటికీ ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సీఆర్డీయే కమిషనర్ నిధులు సమీకరించుకునే అంశంపై మంత్రులు చర్చించనున్నారు. అనంతరం నిధుల సమీకరణకు క్యాబినెట్ అనుమతి ఇవ్వనుంది. అలాగే ఉండవల్లి, పెనుమాక రైతుల జరీబు భూములకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే అంశంపై సీఆర్డీయే అథారిటీ తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్లో అనుమతి లభించనుంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీ, హైకోర్ట్ భవనాల టెండర్లకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. 5వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన అంశాలకు సైతం క్యాబినెట్లో గ్రీన్ సిగ్నల్ పడనుంది. కొత్తగా రూ.30,667 కోట్ల పెట్టుబడులు.. 32,133 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకూ ఆమోదముద్ర వేయనున్నారు మంత్రులు. అలాగే రాజధానిలో ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూకేటాయింపులు చేసే అంశంపైనా చర్చించి ఆమోదం తెలపనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..
PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..